సినిమా అన్నది తల్లి పొత్తిళ్లతోనే మొదలవుతుంది తెలుగువారికి. చంటి పిల్లల్ని భుజాన ఎత్తుకొచ్చి థియేటర్ లో సినిమాలు చూసే తల్లులు చాలామందే కనిపిస్తారు.అలా పరిచయమైన థియేటర్.. ఆ తర్వాత తన సమ్మోహన శక్తితో తరచూ లాగేస్తుంటుంది. సినిమా చూసే రెండున్నర గంటల పాటు తమను తాము మర్చిపోయేలా సరికొత్త అనుభూతిని ఇచ్చే మేజిక్ దాని సొంతం. అలాంటి మేజిక్ ను..కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇప్పటివరకు చూడలేకపోవటం నిజంగానే విచిత్రం. మన చుట్టూ రాజకీయ నేతలు చాలామంది ఉన్నా.. వెనుకబడిన వారు.. గిరిజనుల కోసం.. వారి హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాడే ఎమ్మెల్యే సీతక్క లాంటి వారు సినిమాల్ని చూడరు.
అయితే.. తాను థియేటర్ కు వచ్చి సినిమా చూడటం ఇదే తొలిసారి అని చెప్పినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. గత వారం విడుదలై.. మౌత్ టాక్ తో కలెక్షన్లు పెరుగుతున్న రిపబ్లిక్ మూవీని ఆమె తాజాగా చూశారు. తాను థియేటర్ లో చూసిన తొలి సినిమా అని చెప్పుకొచ్చారు. సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. కీలకమని చెప్పాలి.
ఆమె ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే వింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. సినిమాకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా చూసిన తరువాత గుండె బరువెక్కింది. నాకు ఓ చరిత్ర, ఘటన గుర్తుకు వస్తుంది. బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీని.. ఓ గాడ్సే రూపంలో చంపేస్తే.. అలానే ఓ అధికారి ప్రజల బాధలను తొలగిస్తే.. వారే మళ్లీ తిరిగి అధికారిని చంపడం వంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూడాలి. రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజల్లోనూ మార్పులు రావాలి. ప్రతీ ఒక్కరిలో మార్పులు వస్తే మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోగలం. ప్రజలు, మాలాంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా సినిమాను చూసి మార్పును కోరుకోవాలి’ అని పేర్కొన్నారు. మొత్తానికి థియేటర్లో సీతక్క చూసిన మొదటి సినిమాను.. దాని అనుభూతిని మాత్రం ఎప్పటికి మర్చిపోలేరేమో?
This post was last modified on October 4, 2021 10:13 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…