ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై తాజాగా కేసు నమోదైంది. సాత్వికుడిగా పేరున్న ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ కావటం సంచలనంగా మారింది.
ఇంతకీ ఆయన చేసిన తప్పేమిటన్న విషయంలోకి వెళితే.. యూట్యూబ్ లో పద్యం పాడటమే నేరమైందన్న మాట వినిపిస్తోంది. ఏంటి? యూట్యూబ్ లో పద్యం పాడి.. అప్ లోడ్ చేసినందుకే కేసు పెడతారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇక్కడ జరిగింది వేరంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఒక టీవీ లైవ్ షోకు వెళ్లిన జొన్నవిత్తుల.. తన మాటల సందర్భంలో ఒక పాట పాడారు. ఆ పాటలో అంటరానితనాన్ని కొనసాగించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్చి 23న కరోనా మీద పద్యం పాడారని.. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి వేళ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అయితే.. ఈ వీడియోలో జొన్నవిత్తుల పాడిన పాట ఎస్సీ.. ఎస్టీ వర్గాల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటున్నారు.
ఈ విషయంపై మాల సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్.. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
ఈ ఉదంతంలో తదుపరి చర్యల కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి.. తనపై కేసు నమోదుపై జొన్నవిత్తుల ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
This post was last modified on June 2, 2020 12:26 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి…
తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం…
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…