Political News

పవన్ ని విసిగించిన అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది అనేకన్నా వాళ్ళ రియాక్షన్ తో అనేక వివాదాలు పుట్టుకువస్తున్నాయి. సాధారణంగా ఇవి తరచు ఇతరులకు ఇబ్బంది కలిగించేవి. కానీ ఇపుడు అభిమానుల తీరు పవన్ కే ఇబ్బందిని కలిగించింది.

తాజాగా రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరైన పవన్ మాట్లాడటం మొదలుట్టడమే ఆలస్యం. వెంటనే సీఎం…సీఎం అంటు ఒకటే గోల. కాసేపు నిశ్శబ్దంగా ఉండమని తాను చెప్పేది వినమని పవన్ ఎంత బతిమలాడినా పట్టించుకోలేదు.

ఫ్యాన్స్ వైఖరితో విసిగిపోయిన పవన్ చివరకు చిరాకెత్తి గట్టిగా అరిచేశారు. సీఎం..సీఎం అనే కేకలు విని తాను చాలా అలసిపోయినట్లు మండిపడ్డారు. తన బహిరంగ సభలకు హాజరైన అభిమానులు కూడా పోయిన ఎన్నికల్లో వైసీపీకే ఓట్లేసిన విషయాన్ని గుర్తుచేశారు. తన సభలో కేకలు వేసే అభిమానులు పోలింగ్ లో ఓట్లు మాత్రం వైసీపీకి వేశారని ఈమధ్యనే నేతల విస్తృతస్ధాయి సమావేశంలో కూడా మండిపడిన విషయం అందరు చూసిందే.

సీఎం అనేది తాను ముఖ్యమంత్రి అయినపుడు అరవండి కానీ అప్పటివరకు ఎవరు అలా అరవద్దంటు ఫ్యాన్స్ కు పెద్ద క్లాస్ పీకారు. తన సభల్లో ఎక్కడా ఇకనుండి తాను సీఎం అనే మాట వినబడకూడదంటు ఆంక్షలు విధించారంటేనే ఫ్యాన్స్ తో పవన్ ఎంత విసిగిపోయారో అర్ధమవుతోంది. తాను సీఎం అవ్వాలని నిజంగానే అభిమానులు కోరుకుంటే ఆ పనిని ఎన్నికల్లో ఓట్లేసి చూపించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

This post was last modified on October 3, 2021 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

18 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago