Political News

ప‌వ‌న్ కేం తెలుసు గోంగూర క‌ట్ట‌.. మంత్రి బొత్స

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వ‌రుస‌గా వైసీపీ మంత్రులు, ఆ పార్టీ కీల‌క నేత‌లు విరుచుకు ప‌డుతూనే ఉన్నారు. ప‌వ‌న్ రిప‌బ్లిక్ సినిమా ఫంక్ష‌న్లో ఏపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన మ‌రుక్ష‌ణం నుంచే వైసీపీ వాళ్లు తీవ్ర‌స్థాయిలో ప‌వ‌న్‌పై ఎటాక్ చేస్తున్నారు. పోసాని కృష్ణ‌ముర‌ళీ విమర్శలతో అది తారాస్థాయి వెళ్లింది. ఇప్ప‌టికే ప‌వ‌న్‌ను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప‌వ‌న్‌పై భారీగా విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు బొత్స‌, ఆదిమూల‌పు సురేష్ వంతు వ‌చ్చింది.

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌వ‌న్‌పై సెటైర్లు వేశారు. ప‌వ‌న్ జ‌గ‌న్‌పై, వైసీపీ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ఖండించారు. ప‌వ‌న్ గ‌త 15 సంవ‌త్స‌రాల నుంచి చొక్కాలు చింపుతాన‌ని అంటున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని చొక్కాలు చింపారో చెప్పాల‌న్నారు. ప‌వ‌న్‌కు ఏం తెలుసు గోంగూరు క‌ట్ట అని తీసిపారేశారు. 2009 నుంచి కూడా ప‌వ‌న్ నోటి వెంట ఈ డైలాగులు వింటూనే ఉన్నామ‌ని బొత్స ఎద్దేవా చేశారు.

ఇక మ‌రో మంత్రి ఆదిమూల‌పు సురేష్ కూడా ప‌వ‌న్‌పై విరుచుకు ప‌డ్డారు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ సినీ ఇండ‌స్ట్రీకే లాభ‌మ‌ని సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌లే చెపుతున్నార‌ని.. అలాంటిది ఈ సిస్ట‌మ్‌పై ప‌వ‌న్ ఎందుకు కెలుక్కుంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీ వాళ్ల‌కే న‌చ్చ‌లేద‌ని.. ఇండ‌స్ట్రీ అంతా ఒకే తాటిపై ఒకే మాట మీద ఉంటే ప‌వ‌న్ మ‌ధ్య‌లో కావాల‌నే దీనిని రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ప‌వ‌న్ కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీకే కాకుండా.. రాష్ట్రానికే గుదిబండ‌లా మారార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌వ‌న్ వ్య‌వ‌హారం చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని.. ఆయ‌న కులాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం దారుణ‌మ‌ని సురేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ ఎవ‌రి కోసం పోరాటం చేస్తున్నారో ? ప‌వ‌న్ ఎజెండా ఏంటో ఆయ‌న‌కే తెలియాల‌న్నారు. ప‌వ‌న్ తీరును రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నిస్తూనే ఉన్నార‌ని కూడా సురేష్ అన్నారు.

Satya

Recent Posts

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

1 minute ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

5 minutes ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

27 minutes ago

దేశ‌వ్యాప్తంగా… బొద్దింక‌ల జోరు!

కాక్రోచ్ జ‌నతా పార్టీ(సీజేపీ)గా ఏర్ప‌డి ఉద్య‌మాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్త‌రించే ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తోంది. కొన్ని రోజుల…

1 hour ago

భూములిచ్చిన గౌరవం… విమానంలో రైతులు, రైతు కూలీలు

అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం…

1 hour ago

వీకెండ్ పార్టీలో విగత జీవిగా టెకీ

సాప్ట్ వేర్ రంగమంతా ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే… ఫుల్ ఎంజాయ్ మెంట్ లోకి దిగిపోతోంది. శని, ఆదివారాలు రెండు రోజులూ…

1 hour ago