రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడలో టీడీపీ పుంజుకునేందుకు ఎంతో ఎడ్జ్ ఉంది. అంతేకాదు.. విజయవాడకు సమీపంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నివాసం కూడా ఉంటున్నారు. అయితే.. ఇక్కడ జరుగుతున్న రాజకీయాలను ఆయన లైట్ తీసుకుంటున్నారో.. లేక .. మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే వారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని అనుకుంటున్నారో.. ఎవరికీ తెలియడం లేదు. దీంతో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు విజయవాడలో టీడీపీ పుంజుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు బలంగా ఉండేవి.
అయితే.. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారు ఎవరు అంటే.. వేళ్లపై లెక్కపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో కమ్యూనిస్టులు కూడా ప్రాభవం కోల్పోయారు. ఎప్పుడూ.. కార్పొరేషన్లో పది నుంచి 15 మంది సభ్యులను నెగ్గించుకునే కమ్యూనిస్టులు.. ఈ దఫా ఒక్కరు ఇద్దరితోనే సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉనికి కూడా కనిపించడం లేదు. ఇక, అధికార పక్షం వైసీపీ కూడా వర్గ పోరుతో అల్లాడుతోంది. మా పరిధిలోకి రావద్దంటే.. మా పరిధిలోకి రావద్దంటూ.. నాయకులు గీతలు గీసుకున్నారు.
దీంతో టీడీపీకి ఎదిగేందుకు ఎంతో స్కోప్ ఉంది. అయితే.. ప్రజాబలం ఉన్న నాయకులు పార్టీకి దూరం అవుతుండడమే ఇప్పుడు ప్రధాన మైనస్గా మారిపోయింది. అదేసమయంలో మీడియా ముందు గొంతేసుకుని అరిచే.. వారు..ప్రజల్లో సత్తాలేని వారు మాత్రం పార్టీని నడిపిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది పార్టీకి ప్లస్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే.. వారు మీడియా నాయకులే తప్ప.. ప్రజానాయకులు ఎంత మాత్రం కాదనే విషయం సుస్పష్టం. ఇక, గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా వీరి దెబ్బతో.. మౌనం పాటిస్తున్నారు.
ఎంపీ నాని కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు.. నియోజకవర్గాల్లో పుంజుకునే కార్యక్రమాలను పక్కన పెట్టిన ఈ మీడియాబ్యాచ్.. వ్యక్తిగత గుర్తింపు కోసం.. పార్టీలో పదవుల కోసం .. తహతహ లాడుతోంది. దీంతో.. క్షేత్రస్థాయిలో నాయకులను కార్యకర్తలను పట్టించుకునేవారు లేకుండా పోయారనేది కార్యకర్తల నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. మరోవైపు.. ప్రజల్లో బలం ఉన్న నాయకులు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. సామాజిక సమీకరణ ప్రకారం చూసుకున్నా.. ఇదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్కరించకపోతే.. కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…