ఏపీ సీఎం జగన్ వ్యూహం బెడిసి కొడుతుందా ? ఆయన తీసుకునే నిర్ణయం.. పార్టీపై ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తుందా ? పాలన మందగిస్తుందా ? అంటే.. అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2019లో అధికార పగ్గాలు చేపడుతూనే.. సీఎం జగన్ తన మంత్రి వర్గంలో 90 శాతం మారుస్తానంటూ.. ప్రకటించారు. అయితే.. అప్పటికే సోషల్ ఇంజనీరింగ్ను పాటించిన నేపథ్యంలో బాగానే ఉంటుందని.. పార్టీలోనూ అసంతృప్తులు తగ్గుతాయని ఆయన భావించి ఉండొచ్చు. కానీ, ఇప్పటికి రెండున్నరేళ్లు.. గడుస్తున్నా.. పాలనపై పట్టు ఇప్పుడున్న మంత్రులకు దక్కలేదనేది వాస్తవం. అనేక శాఖల్లో ఇంకా అధికారులపైనే ఆధారపడి మంత్రులు చక్రం తిప్పుతున్నారు. దీనివల్ల అభివృద్ధి మందగించింది.
ఇది.. పార్టీపై ఎలా ఉన్నప్పటికీ.. జగన్ పాలనపై మాత్రం వ్యతిరేకత పెంచుతుందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే రెండున్నరేళ్లు కూడా అత్యంత కీలకం. ప్రజలకు నిధులు ఇచ్చినా.. సంక్షేమాన్ని అమలు చేసినా.. శాఖలపై పట్టుతో మంత్రులు పుంజుకుని.. అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన కీలక సమయం. ఈ రెండున్నరేళ్లలో పాలన పక్కదారి పడితే.. ఖచ్చితంగా.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. గతంలో చంద్రబాబు హయాంలోనూ చివరి ఏడాదిన్నర.. కేంద్రం నుంచి సహకారం లోపించడం.. మంత్రులపై ఆరోపణలు రావడం.. చంద్రబాబు కేంద్రంపై పోరు బాట పట్టడం.. వంటివి అప్పటి వరకు ఉన్న పాజిటివిటీని నెగిటివ్గా మార్చాయి. ఫలితంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ఆయన విజయం దక్కించుకోలేక పోయారు.
అలాగని.. మార్చకూడదని.. మార్పు ఉండకూడదని ఎవరూ అనడంలేదు. అయితే.. కీలక శాఖలైన ఆర్థిక, పట్టణ, గ్రామీణ, రెవెన్యూ, పెట్టుబడులు, పరిశ్రమలు.. ఇలా కొన్ని శాఖల విషయంలో పట్టు విడుపులు అత్యంత కీలకమని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ అందరినీ గుండుగుత్తుగా మార్చేస్తే.. ఆయా శాఖలపై కొత్తగా వచ్చే మంత్రులు పట్టు సాధించే సరికే పుణ్యకాలం గడిచిపోయి.. ఎన్నికల నామ సంవత్సరం వచ్చేస్తే.. పార్టీ ఎలా ఉన్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి.. మొత్తానికే కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.
కీలకమైన శాఖలను మార్పు చేయకుండా.. కొన్ని శాఖలపై పట్టు పెంచుకున్న మంత్రులను కొనసాగించడం ద్వారా.. సీనియర్లను వదులు కోకుండా చూడడం ద్వారా.. మార్పు చేసి పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆర్థిక మంత్రి బుగ్గనను మార్చేస్తే.. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే స్థాయికి నూతన మంత్రి ఎప్పటికి చేరుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. ఇలా.. మొత్తంగా చూస్తే.. సంపూర్ణ మార్పు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on September 27, 2021 7:15 am
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…