Political News

జ‌గ‌న్‌ వ్యూహం బెడిసికొడితే.. మొత్తానికే న‌ష్టం…!

ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యూహం బెడిసి కొడుతుందా ? ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం.. పార్టీపై ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకు వ‌స్తుందా ? పాల‌న మంద‌గిస్తుందా ? అంటే.. అవుననే అంటున్నారు విశ్లేష‌కులు. 2019లో అధికార ప‌గ్గాలు చేప‌డుతూనే.. సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలో 90 శాతం మారుస్తానంటూ.. ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌టికే సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌ను పాటించిన నేప‌థ్యంలో బాగానే ఉంటుంద‌ని.. పార్టీలోనూ అసంతృప్తులు త‌గ్గుతాయ‌ని ఆయ‌న భావించి ఉండొచ్చు. కానీ, ఇప్ప‌టికి రెండున్న‌రేళ్లు.. గ‌డుస్తున్నా.. పాల‌న‌పై ప‌ట్టు ఇప్పుడున్న మంత్రుల‌కు ద‌క్క‌లేద‌నేది వాస్త‌వం. అనేక శాఖ‌ల్లో ఇంకా అధికారుల‌పైనే ఆధార‌ప‌డి మంత్రులు చ‌క్రం తిప్పుతున్నారు. దీనివ‌ల్ల అభివృద్ధి మంద‌గించింది.

ఇది.. పార్టీపై ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ పాల‌న‌పై మాత్రం వ్య‌తిరేక‌త పెంచుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. వ‌చ్చే రెండున్న‌రేళ్లు కూడా అత్యంత కీల‌కం. ప్ర‌జ‌ల‌కు నిధులు ఇచ్చినా.. సంక్షేమాన్ని అమ‌లు చేసినా.. శాఖ‌ల‌పై ప‌ట్టుతో మంత్రులు పుంజుకుని.. అభివృద్ధిని ప‌రుగులు పెట్టించాల్సిన కీల‌క స‌మ‌యం. ఈ రెండున్న‌రేళ్ల‌లో పాల‌న ప‌క్క‌దారి ప‌డితే.. ఖ‌చ్చితంగా.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డం ఖాయం. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ చివ‌రి ఏడాదిన్న‌ర‌.. కేంద్రం నుంచి స‌హ‌కారం లోపించ‌డం.. మంత్రులపై ఆరోప‌ణ‌లు రావ‌డం.. చంద్ర‌బాబు కేంద్రంపై పోరు బాట ప‌ట్ట‌డం.. వంటివి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పాజిటివిటీని నెగిటివ్‌గా మార్చాయి. ఫ‌లితంగా ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసినా.. ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

అలాగ‌ని.. మార్చ‌కూడ‌ద‌ని.. మార్పు ఉండ‌కూడ‌ద‌ని ఎవ‌రూ అన‌డంలేదు. అయితే.. కీల‌క శాఖ‌లైన ఆర్థిక‌, ప‌ట్ట‌ణ‌, గ్రామీణ‌, రెవెన్యూ, పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌లు.. ఇలా కొన్ని శాఖ‌ల విష‌యంలో ప‌ట్టు విడుపులు అత్యంత కీల‌క‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వేళ అంద‌రినీ గుండుగుత్తుగా మార్చేస్తే.. ఆయా శాఖ‌ల‌పై కొత్త‌గా వ‌చ్చే మంత్రులు ప‌ట్టు సాధించే స‌రికే పుణ్య‌కాలం గ‌డిచిపోయి.. ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం వ‌చ్చేస్తే.. పార్టీ ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగి.. మొత్తానికే కుప్ప‌కూలే ప్ర‌మాదం ఉంటుంది.

కీల‌క‌మైన శాఖ‌ల‌ను మార్పు చేయ‌కుండా.. కొన్ని శాఖ‌ల‌పై ప‌ట్టు పెంచుకున్న మంత్రుల‌ను కొన‌సాగించ‌డం ద్వారా.. సీనియ‌ర్ల‌ను వ‌దులు కోకుండా చూడ‌డం ద్వారా.. మార్పు చేసి ప‌నులు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఆర్థిక మంత్రి బుగ్గ‌న‌ను మార్చేస్తే.. ఢిల్లీలో వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టే స్థాయికి నూత‌న మంత్రి ఎప్ప‌టికి చేరుకుంటార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. సో.. ఇలా.. మొత్తంగా చూస్తే.. సంపూర్ణ మార్పు మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on September 27, 2021 7:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago