ఏపీ సీఎం జగన్ వ్యూహం బెడిసి కొడుతుందా ? ఆయన తీసుకునే నిర్ణయం.. పార్టీపై ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తుందా ? పాలన మందగిస్తుందా ? అంటే.. అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2019లో అధికార పగ్గాలు చేపడుతూనే.. సీఎం జగన్ తన మంత్రి వర్గంలో 90 శాతం మారుస్తానంటూ.. ప్రకటించారు. అయితే.. అప్పటికే సోషల్ ఇంజనీరింగ్ను పాటించిన నేపథ్యంలో బాగానే ఉంటుందని.. పార్టీలోనూ అసంతృప్తులు తగ్గుతాయని ఆయన భావించి ఉండొచ్చు. కానీ, ఇప్పటికి రెండున్నరేళ్లు.. గడుస్తున్నా.. పాలనపై పట్టు ఇప్పుడున్న మంత్రులకు దక్కలేదనేది వాస్తవం. అనేక శాఖల్లో ఇంకా అధికారులపైనే ఆధారపడి మంత్రులు చక్రం తిప్పుతున్నారు. దీనివల్ల అభివృద్ధి మందగించింది.
ఇది.. పార్టీపై ఎలా ఉన్నప్పటికీ.. జగన్ పాలనపై మాత్రం వ్యతిరేకత పెంచుతుందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే రెండున్నరేళ్లు కూడా అత్యంత కీలకం. ప్రజలకు నిధులు ఇచ్చినా.. సంక్షేమాన్ని అమలు చేసినా.. శాఖలపై పట్టుతో మంత్రులు పుంజుకుని.. అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన కీలక సమయం. ఈ రెండున్నరేళ్లలో పాలన పక్కదారి పడితే.. ఖచ్చితంగా.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. గతంలో చంద్రబాబు హయాంలోనూ చివరి ఏడాదిన్నర.. కేంద్రం నుంచి సహకారం లోపించడం.. మంత్రులపై ఆరోపణలు రావడం.. చంద్రబాబు కేంద్రంపై పోరు బాట పట్టడం.. వంటివి అప్పటి వరకు ఉన్న పాజిటివిటీని నెగిటివ్గా మార్చాయి. ఫలితంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ఆయన విజయం దక్కించుకోలేక పోయారు.
అలాగని.. మార్చకూడదని.. మార్పు ఉండకూడదని ఎవరూ అనడంలేదు. అయితే.. కీలక శాఖలైన ఆర్థిక, పట్టణ, గ్రామీణ, రెవెన్యూ, పెట్టుబడులు, పరిశ్రమలు.. ఇలా కొన్ని శాఖల విషయంలో పట్టు విడుపులు అత్యంత కీలకమని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ అందరినీ గుండుగుత్తుగా మార్చేస్తే.. ఆయా శాఖలపై కొత్తగా వచ్చే మంత్రులు పట్టు సాధించే సరికే పుణ్యకాలం గడిచిపోయి.. ఎన్నికల నామ సంవత్సరం వచ్చేస్తే.. పార్టీ ఎలా ఉన్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి.. మొత్తానికే కుప్పకూలే ప్రమాదం ఉంటుంది.
కీలకమైన శాఖలను మార్పు చేయకుండా.. కొన్ని శాఖలపై పట్టు పెంచుకున్న మంత్రులను కొనసాగించడం ద్వారా.. సీనియర్లను వదులు కోకుండా చూడడం ద్వారా.. మార్పు చేసి పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆర్థిక మంత్రి బుగ్గనను మార్చేస్తే.. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టే స్థాయికి నూతన మంత్రి ఎప్పటికి చేరుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. ఇలా.. మొత్తంగా చూస్తే.. సంపూర్ణ మార్పు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on September 27, 2021 7:15 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…