ఆ ఇద్దరు యువ నాయకులు ఏపీ సీఎం జగన్కు తలనొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జగన్ను ఇబ్బంది పెడుతున్నాయా? కీలకమైన జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి.. ఈ ఇద్దరు నేతలే కారణమని.. సీఎంకు సమాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ! తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. గత 2019 ఎన్నికల్లో జగన్ సునామీ వీచినా.. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బలమైన కేడర్.. ఓటు బ్యాంకు రెండూ ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక్కడి నేతలు సమర్ధవంతంగా.. కలిసిమెలిసి పనిచేయాలని.. జగన్ తరచుగా చెబుతున్నారు.
ఈ క్రమంలో కొందరు నాయకులు కలిసి మెలిసి పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం.. తరచుగా వివాదాలకు దిగుతున్నారు. సవాళ్లు రువ్వుకుంటున్నారు. అంతేకాదు.. సీఎం జగన్ దగ్గర నాకే పలుకుబడి ఉంది.. నువ్వు బచ్చా! అంటూ..పరుష పదజాలంతో కామెంట్లు చేసుకుంటున్నారు. ఇది.. వైసీపీకి డ్యామేజీ చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వరంగా మారింది. రాజమండ్రి నుంచి గెలిచిన మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల పరిస్థితి పార్టీని తీవ్ర సంకటంలోకి నెట్టింది. సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఈ నాయకులు.. ఒకరిపపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఇసుక అక్రమాలు.. అంటూ.. సొంత పార్టీ నేతలపై ఎంపీ పోరు బాట పట్టారు.
ఇక, అప్పటి నుంచి ఎమ్మెల్యే రాజా దూకుడు పెంచారు. దీంతో వీరి మధ్య వివాదాలు.. తాజాగా జరిగిన ఓ ఉపాధ్యాయుడిపై దాడిఘటన మరింత పెంచింది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం మరింత తారస్థాయికి చేరింది. ఇరువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా పరుష పదజాలంతో దూషించుకున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే.. మున్ముందు కష్టమని.. పార్టీ కీలక సలహాదారు నుంచి సందేశం వెళ్లిందని తూర్పులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ఉండాలంటే.. పార్టీ విధానాలను గౌరవించాలని.. రోడ్డున పడికొట్టుకోవడం సరికాదని.. పార్టీ అధిష్టానం నుంచి సందేశం వచ్చినట్టు సదరు నాయకుల అనుచరులు గుసగుసలాడుతున్నారు. మరోవైపు.. వీరి వ్యవహార శైలిని టీడీపీ మరింతగా ప్రచారం చేస్తుండడం పార్టీకి డ్యామేజీగా మారింది. మరివీరు మారతారో.. లేక జగనే వీరిని మారుస్తారో ? చూడాలి.
This post was last modified on October 3, 2021 10:19 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…