Political News

జ‌గ‌న్‌కు ప‌రీక్ష పెడుతున్న యువ నేత‌లు.. ఇద్ద‌రినీ ప‌క్క‌న పెడ‌తారా..?

ఆ ఇద్ద‌రు యువ నాయ‌కులు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతున్నాయా? కీల‌క‌మైన జిల్లాలో పార్టీ ప‌ట్టుకోల్పోవ‌డానికి.. ఈ ఇద్ద‌రు నేత‌లే కార‌ణ‌మ‌ని.. సీఎంకు స‌మాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌! తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ వీచినా.. ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్‌.. ఓటు బ్యాంకు రెండూ ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నేత‌లు స‌మ‌ర్ధవంతంగా.. క‌లిసిమెలిసి ప‌నిచేయాల‌ని.. జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు నాయ‌కులు క‌లిసి మెలిసి ప‌నిచేస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం.. త‌ర‌చుగా వివాదాల‌కు దిగుతున్నారు. స‌వాళ్లు రువ్వుకుంటున్నారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర నాకే ప‌లుకుబ‌డి ఉంది.. నువ్వు బ‌చ్చా! అంటూ..ప‌రుష ప‌ద‌జాలంతో కామెంట్లు చేసుకుంటున్నారు. ఇది.. వైసీపీకి డ్యామేజీ చేస్తుండ‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి వ‌రంగా మారింది. రాజ‌మండ్రి నుంచి గెలిచిన మార్గాని భ‌ర‌త్‌.. రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాల ప‌రిస్థితి పార్టీని తీవ్ర సంక‌టంలోకి నెట్టింది. స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల్సిన ఈ నాయ‌కులు.. ఒక‌రిప‌పై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట ఇసుక అక్ర‌మాలు.. అంటూ.. సొంత పార్టీ నేత‌ల‌పై ఎంపీ పోరు బాట ప‌ట్టారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే రాజా దూకుడు పెంచారు. దీంతో వీరి మ‌ధ్య వివాదాలు.. తాజాగా జ‌రిగిన ఓ ఉపాధ్యాయుడిపై దాడిఘ‌ట‌న మ‌రింత పెంచింది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం మ‌రింత తార‌స్థాయికి చేరింది. ఇరువురు నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రుష ప‌ద‌జాలంతో దూషించుకున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగిస్తే.. మున్ముందు క‌ష్ట‌మ‌ని.. పార్టీ కీల‌క స‌ల‌హాదారు నుంచి సందేశం వెళ్లింద‌ని తూర్పులో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీలో ఉండాలంటే.. పార్టీ విధానాల‌ను గౌర‌వించాల‌ని.. రోడ్డున ప‌డికొట్టుకోవ‌డం స‌రికాద‌ని.. పార్టీ అధిష్టానం నుంచి సందేశం వ‌చ్చిన‌ట్టు స‌ద‌రు నాయ‌కుల అనుచ‌రులు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రోవైపు.. వీరి వ్య‌వ‌హార శైలిని టీడీపీ మ‌రింత‌గా ప్ర‌చారం చేస్తుండ‌డం పార్టీకి డ్యామేజీగా మారింది. మ‌రివీరు మార‌తారో.. లేక జ‌గ‌నే వీరిని మారుస్తారో ? చూడాలి.

This post was last modified on October 3, 2021 10:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

26 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

38 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

4 hours ago