Political News

జ‌గ‌న్‌కు ప‌రీక్ష పెడుతున్న యువ నేత‌లు.. ఇద్ద‌రినీ ప‌క్క‌న పెడ‌తారా..?

ఆ ఇద్ద‌రు యువ నాయ‌కులు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతున్నాయా? కీల‌క‌మైన జిల్లాలో పార్టీ ప‌ట్టుకోల్పోవ‌డానికి.. ఈ ఇద్ద‌రు నేత‌లే కార‌ణ‌మ‌ని.. సీఎంకు స‌మాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌! తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ వీచినా.. ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్‌.. ఓటు బ్యాంకు రెండూ ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నేత‌లు స‌మ‌ర్ధవంతంగా.. క‌లిసిమెలిసి ప‌నిచేయాల‌ని.. జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు నాయ‌కులు క‌లిసి మెలిసి ప‌నిచేస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం.. త‌ర‌చుగా వివాదాల‌కు దిగుతున్నారు. స‌వాళ్లు రువ్వుకుంటున్నారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర నాకే ప‌లుకుబ‌డి ఉంది.. నువ్వు బ‌చ్చా! అంటూ..ప‌రుష ప‌ద‌జాలంతో కామెంట్లు చేసుకుంటున్నారు. ఇది.. వైసీపీకి డ్యామేజీ చేస్తుండ‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి వ‌రంగా మారింది. రాజ‌మండ్రి నుంచి గెలిచిన మార్గాని భ‌ర‌త్‌.. రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాల ప‌రిస్థితి పార్టీని తీవ్ర సంక‌టంలోకి నెట్టింది. స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల్సిన ఈ నాయ‌కులు.. ఒక‌రిప‌పై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట ఇసుక అక్ర‌మాలు.. అంటూ.. సొంత పార్టీ నేత‌ల‌పై ఎంపీ పోరు బాట ప‌ట్టారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఎమ్మెల్యే రాజా దూకుడు పెంచారు. దీంతో వీరి మ‌ధ్య వివాదాలు.. తాజాగా జ‌రిగిన ఓ ఉపాధ్యాయుడిపై దాడిఘ‌ట‌న మ‌రింత పెంచింది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం మ‌రింత తార‌స్థాయికి చేరింది. ఇరువురు నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రుష ప‌ద‌జాలంతో దూషించుకున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగిస్తే.. మున్ముందు క‌ష్ట‌మ‌ని.. పార్టీ కీల‌క స‌ల‌హాదారు నుంచి సందేశం వెళ్లింద‌ని తూర్పులో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీలో ఉండాలంటే.. పార్టీ విధానాల‌ను గౌర‌వించాల‌ని.. రోడ్డున ప‌డికొట్టుకోవ‌డం స‌రికాద‌ని.. పార్టీ అధిష్టానం నుంచి సందేశం వ‌చ్చిన‌ట్టు స‌ద‌రు నాయ‌కుల అనుచ‌రులు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రోవైపు.. వీరి వ్య‌వ‌హార శైలిని టీడీపీ మ‌రింత‌గా ప్ర‌చారం చేస్తుండ‌డం పార్టీకి డ్యామేజీగా మారింది. మ‌రివీరు మార‌తారో.. లేక జ‌గ‌నే వీరిని మారుస్తారో ? చూడాలి.

This post was last modified on October 3, 2021 10:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago