ఆ ఇద్దరు యువ నాయకులు ఏపీ సీఎం జగన్కు తలనొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జగన్ను ఇబ్బంది పెడుతున్నాయా? కీలకమైన జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి.. ఈ ఇద్దరు నేతలే కారణమని.. సీఎంకు సమాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ! తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. గత 2019 ఎన్నికల్లో జగన్ సునామీ వీచినా.. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బలమైన కేడర్.. ఓటు బ్యాంకు రెండూ ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక్కడి నేతలు సమర్ధవంతంగా.. కలిసిమెలిసి పనిచేయాలని.. జగన్ తరచుగా చెబుతున్నారు.
ఈ క్రమంలో కొందరు నాయకులు కలిసి మెలిసి పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం.. తరచుగా వివాదాలకు దిగుతున్నారు. సవాళ్లు రువ్వుకుంటున్నారు. అంతేకాదు.. సీఎం జగన్ దగ్గర నాకే పలుకుబడి ఉంది.. నువ్వు బచ్చా! అంటూ..పరుష పదజాలంతో కామెంట్లు చేసుకుంటున్నారు. ఇది.. వైసీపీకి డ్యామేజీ చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వరంగా మారింది. రాజమండ్రి నుంచి గెలిచిన మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల పరిస్థితి పార్టీని తీవ్ర సంకటంలోకి నెట్టింది. సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఈ నాయకులు.. ఒకరిపపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఇసుక అక్రమాలు.. అంటూ.. సొంత పార్టీ నేతలపై ఎంపీ పోరు బాట పట్టారు.
ఇక, అప్పటి నుంచి ఎమ్మెల్యే రాజా దూకుడు పెంచారు. దీంతో వీరి మధ్య వివాదాలు.. తాజాగా జరిగిన ఓ ఉపాధ్యాయుడిపై దాడిఘటన మరింత పెంచింది. అయితే.. ఇప్పుడు ఈ వివాదం మరింత తారస్థాయికి చేరింది. ఇరువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా పరుష పదజాలంతో దూషించుకున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే.. మున్ముందు కష్టమని.. పార్టీ కీలక సలహాదారు నుంచి సందేశం వెళ్లిందని తూర్పులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ఉండాలంటే.. పార్టీ విధానాలను గౌరవించాలని.. రోడ్డున పడికొట్టుకోవడం సరికాదని.. పార్టీ అధిష్టానం నుంచి సందేశం వచ్చినట్టు సదరు నాయకుల అనుచరులు గుసగుసలాడుతున్నారు. మరోవైపు.. వీరి వ్యవహార శైలిని టీడీపీ మరింతగా ప్రచారం చేస్తుండడం పార్టీకి డ్యామేజీగా మారింది. మరివీరు మారతారో.. లేక జగనే వీరిని మారుస్తారో ? చూడాలి.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…