Political News

గ్రేట్ న్యూస్ – తెలంగాణకు ఇక నో పాస్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో 30 వరకు లాక్ డౌన్ పొడగించారు. అదే సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని సడలింపులు ఇచ్చారు. తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు.

ఎవరైనా ఇక్కడి నుంచి పోవచ్చు. కేంద్రం ఆయా రాష్ట్రాల సరిహద్దులను తెరిచే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి అందరికీ వెల్ కం చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణలోకి ఏపీ నుంచి ఎవరైనా రావచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏపీ వారు ఇక్కడికి రావడానికి అనుమతి దొరికింది. మరి ఏపీలోకి రావచ్చా లేదా అన్నది ఇంకా అక్కడి ప్రభుత్వం ప్రకటించలేదు. ఇపుడు ఇచ్చిన సడలింపుల వల్ల వ్యాపారం పెద్దగా మెరుగుపడకపోవడంతో కేంద్రం ఇచ్చిన సడలింపులు అన్నీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపారు.

హైదరాబాదులో – అటు ఏపీలో అటు ఇటు ఇరుక్కుపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది పెద్ద గుడ్ న్యూస్. రాత్రి కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ కేంద్రాన్నే ఫాలో అయ్యారు. 8వ తేదీ నుంచి భద్రాచలం సహా తెలంగాణ ఆలయాలన్నీ తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది.

This post was last modified on June 1, 2020 10:54 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

36 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

1 hour ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

1 hour ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago