కరోనా వైరస్ను ప్రభుత్వాలు, జనాలు ఎంత లైట్ తీసుకుంటే అది అంతగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వందలు, వేలల్లో కేసులు నమోదవుతున్నపుడు రోజూ పదుల సంఖ్యలో కేసులతో తెలంగాణలో అదుపులోనే ఉన్నట్లు కనిపించిన వైరస్.. కొన్ని రోజులుగా తన ఉద్ధృతి చూపిస్తోంది.
ఇటీవలే ఒక్క రోజులో 169 కేసులతో హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం మధ్య ఏకంగా 199 కేసులు నమోదయ్యాయి తెలంగాణలో.
ఇది కొత్త రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో 196 కేసులు తెలంగాణలో నమోదైనవే కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలసదారులు ముగ్గురు కరోనాతో ఇక్కడ అడుగు పెట్టారు.
ఎప్పట్లాగే మెజారిటీ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 122 కేసులు బయటపడగా.. రంగారెడ్డిలో 40 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల వ్యవధిలో ఐదుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 82గా ఉంది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2700 దాకా ఉన్నాయి. అందులో 1500 మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1200 దాకా ఉన్నాయి. ఇక ఆదివారం ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు భారీగానే నమోదయ్యాయి.
మొత్తం కేసులు లక్షా 80 వేల మార్కును దాటేశాయి. మరణాలు 6 వేల దాకా ఉన్నాయి. కరోనా ధాటికి అత్యధిక ప్రభావం పడ్డ దేశాల జాబితాలో భారత్ స్థానం ఇప్పుడు ఏడుకు పెరిగింది. చైనా సహా చాలా దేశాల్ని దాటి భారత్ ముందుకెళ్లిపోయింది.
This post was last modified on June 1, 2020 10:10 am
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…