Political News

ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ అదిరిపోయే ట్వీట్‌

ఏపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా.. విమ‌ర్శ‌లు గుప్పించే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీజేపీతో చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. విమ‌ర్శ‌లు త‌గ్గించారు. అడ‌పా ద‌డ‌పా మాత్రమే చిన్న పాటి కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ట్విట్ట‌ర్ వేదిగా .. ఓ రేంజ్‌లో ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చిన్న చిన్న ప‌దాలతో ఏపీ స‌ర్కారు వైఖ‌రిని ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. ఎక్క‌డా భారీ విమ‌ర్శ‌లు గుప్పించ‌లేదు. కానీ.. ప‌దునైన వ్యాఖ్య‌లతో విరుచుకుప‌డ్డారు. ఏపీని నాశ‌నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆంధ్రాను అమ్మేస్తున్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు.

కేవ‌లం చిన్న స్లైడ్‌పై చిన్న చిన్న వ్యాఖ్య‌లతో చాలా తీవ్రంగా నిప్పులు చెరిగారు. అబ‌ద్ధాలు.. అబ‌ద్ధాలు, రాజ‌కీయక‌క్ష‌లు, ప్ర‌జాధ‌నం దుర్వినియోగం, మ‌రో వెనిజులా, ఇసుక అక్ర‌మ తొవ్వ‌కాలు.. అంటూ.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, రాష్ట్రంలో ప్ర‌భుత్వం అమ్ముతున్న మ‌ద్యం పైనా చమ్మ‌క్కులు పేల్చారు. ‘బూమ్ బూమ్‌’ ప్రెసిడెంట్ మెడ‌ల్ పేరుతో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. యువ‌త‌ను గాలికి వ‌దిలేశార‌ని.. ద‌ళితుల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు లేవు.. గ్రూప్ 1, 2ల‌కు క‌లిపి .. కేవ‌లం 36 పోస్టులే ప్ర‌క‌టించార‌ని పేర్కొన్నారు. యువ‌త‌ను జ‌గ‌న్ మోసం చేశారు అని వ్యాఖ్య చేశారు.

ఇక‌, ఏపీని ర‌క్షించాల‌ని కామెంట్ చేశారు. మ‌ట‌న్ షాపులు, సినిమా టికెట్లు, టాయిలెట్ల‌పై ప‌న్ను వంటి వాటిని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇక‌, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ర‌క్ష‌ణ క‌రువైంద‌ని పేర్కొన్నారు. 18000 లిక్క‌ర్ మాఫియా, నేరాలు 68 శాతం పెరిగిపోయాయ‌ని పేర్కొన్నారు. అప్పుల ప్ర‌దేశ్‌గా మారిపోయింద‌న్నారు. కరెంటు చార్జీలు పెంచేశారు. తొండంగిని కాపాడాలి.. ఇలా.. అనేక విష‌యాల‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తూ.. ఎలాంటి ఘాటు విమ‌ర్శ‌లు సంచ‌ల‌న కామెంట్లు లేకుండా.. ఉన్న‌ది ఉన్న‌ట్టు ఉతికి ఆరేశారు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో ఇది భారీ ఎత్తున ట్రోల్ అవుతుండ‌డం విశేషం.

This post was last modified on September 23, 2021 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

2 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago