Political News

శ్రీవారి దర్శనానికి డేట్ ఫిక్సయింది

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలన్నీ తెరుచుకోబోతున్నాయి. జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మిగతా వాటి కంటే దేశంలో అత్యధికంగా ఎదురు చూస్తున్నది తిరుమల శ్రీవారి దర్శనం కోసమే. రోజూ లక్ష మందికి పైనే దర్శించే శ్రీవారి ఆలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలకు పైగా మూత పడి ఉంది.

ఐతే ఎప్పుడు పున:ప్రారంభించినా భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో జూన్ 8నే శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఐతే టీటీడీ ఈ విషయంలో ముందడుగే వేయడానికి నిశ్చయించుకుంది. జూన్ 8నే శ్రీవారి ఆలయాన్ని తెరవబోతున్నారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

టీటీడీ అయితే 8నే దర్శనాల్ని మొదలుపెట్టాలనుకుంటోంది. దీనికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపాల్సి ఉంది. అది లాంఛనమే అని భావిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆన్ లైన్, కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు కేటాయించనున్నారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్ద తనిఖీ కేంద్రంలతో, మెట్ల మార్గంలో వైద్య పరీక్షలు చేస్తారు. రోజూ నిర్ణీత సంఖ్యలోనే భక్తుల్ని కొండ మీదికి, దర్శనానికి అనుమతించనున్నారు. కంపార్టుమెంట్లలో భక్తుల్ని పెట్టే పద్ధతి కొన్ని నెలల పాటు ఉండదు.

అవన్నీ మూసి వేస్తున్నారు. నేరుగా క్యూ లైన్లలో ప్రవేశం మొదలవుతుంది. మళ్లీ ఆలయం నుంచి బయటికి వచ్చే వరకు భక్తుడికి భక్తుడికి మధ్య దూరాన్ని నిర్దేశిస్తూ రెడ్ టేపుతో మార్కింగ్ చేశారు. ఆ దూరం పాటిస్తూనే దర్శనానికి వెళ్లాలి. వసతి గదుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరికి మించి అనుమతించరు. తలనీలాల వద్ద కూడా షరతులుంటాయి. దీనిపై ముందే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు.

This post was last modified on May 31, 2020 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

41 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago