Political News

శ్రీవారి దర్శనానికి డేట్ ఫిక్సయింది

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలన్నీ తెరుచుకోబోతున్నాయి. జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మిగతా వాటి కంటే దేశంలో అత్యధికంగా ఎదురు చూస్తున్నది తిరుమల శ్రీవారి దర్శనం కోసమే. రోజూ లక్ష మందికి పైనే దర్శించే శ్రీవారి ఆలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలకు పైగా మూత పడి ఉంది.

ఐతే ఎప్పుడు పున:ప్రారంభించినా భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో జూన్ 8నే శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఐతే టీటీడీ ఈ విషయంలో ముందడుగే వేయడానికి నిశ్చయించుకుంది. జూన్ 8నే శ్రీవారి ఆలయాన్ని తెరవబోతున్నారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

టీటీడీ అయితే 8నే దర్శనాల్ని మొదలుపెట్టాలనుకుంటోంది. దీనికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపాల్సి ఉంది. అది లాంఛనమే అని భావిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆన్ లైన్, కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు కేటాయించనున్నారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్ద తనిఖీ కేంద్రంలతో, మెట్ల మార్గంలో వైద్య పరీక్షలు చేస్తారు. రోజూ నిర్ణీత సంఖ్యలోనే భక్తుల్ని కొండ మీదికి, దర్శనానికి అనుమతించనున్నారు. కంపార్టుమెంట్లలో భక్తుల్ని పెట్టే పద్ధతి కొన్ని నెలల పాటు ఉండదు.

అవన్నీ మూసి వేస్తున్నారు. నేరుగా క్యూ లైన్లలో ప్రవేశం మొదలవుతుంది. మళ్లీ ఆలయం నుంచి బయటికి వచ్చే వరకు భక్తుడికి భక్తుడికి మధ్య దూరాన్ని నిర్దేశిస్తూ రెడ్ టేపుతో మార్కింగ్ చేశారు. ఆ దూరం పాటిస్తూనే దర్శనానికి వెళ్లాలి. వసతి గదుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరికి మించి అనుమతించరు. తలనీలాల వద్ద కూడా షరతులుంటాయి. దీనిపై ముందే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు.

This post was last modified on May 31, 2020 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

20 minutes ago

స్టార్ పిల్లలను పట్టించుకోవడం లేదబ్బా

మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…

23 minutes ago

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…

24 minutes ago

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

2 hours ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

2 hours ago

జపాన్ దేశానికి ‘శనివారం’ – సరిపోతుందా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…

2 hours ago