Political News

టీడీపీ-జ‌న‌సేన.. ట్ర‌య‌ల్ ర‌న్ ఓకే… ఇక‌.. ఒక్క‌టే మిగిలింది…!


రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు పై మాటే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. మ‌రో ప‌క్షం జ‌న‌సేలు.. ముసుగులు తీసేస్తే.. ఇక‌, తిరుగు లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వ‌చ్చిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లే కాకుండా.. కొన్నాళ్ల కింద‌టే జ‌రిగిన మునిసిప‌ల్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేశాయి. (స్థానికంగా నేత‌లు చేతులు క‌లిపార‌ని.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. పార్టీలు ప్ర‌క‌టించుకున్నాయి). అయితే.. నాయ‌కులు మాత్రం వారికి సంపూర్ణంగా స‌హ‌క‌రించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. పార్టీల అధినాయ‌కులు.. మాత్రం దూరంగానే ఉన్న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీలకులు. తాజాగా వ‌చ్చిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు చూపించినా.. వైసీపీ పాల‌న అద్భుతంగా ఉంద‌ని చెప్పుకొన్నా..కొన్ని చోట్ల‌.. జ‌న‌సేన‌+ టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. అలాంటి చోట వైసీపీకి చుక్కలు క‌నిపించాయి. ఇలాంటి నాలుగు మాత్ర‌మే ఉండొచ్చు.. కానీ… వీటిని ఆధారంగా చేసుకుంటే.. రాష్ట్రంలో అధికార మార్పిడి ఈజీనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు మంచి ఎడ్జ్ క‌నిపిస్తోంది. 2014లో ఎలాంటి ప‌రిస్థితి ఉందో ఇప్పుడు కూడా ఉభ‌య గోదావ‌రులు, విశాఖ‌, సీమల్లో.. ఈ రెండు పార్టీల‌కు బాగానే ఫాలోయింగ్ ఉంది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ట్ర‌య‌ల్ ర‌న్‌గా భావిస్తే.. ఈ ర‌న్‌లో ఈ రెండు పార్టీలూ స‌క్సెస్ అయ్యాయి. సో.. ఇప్ప‌టికైనా.. పార్టీలుచేతులు క‌లుపుకొని.. ఉమ్మ‌డి వ్యూహంతో ముందుకు సాగితే.. ప్ర‌భుత్వ ఏర్పాటు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014లో జ‌రిగింది ఇదే. అయితే.. అప్ప‌ట్లో జ‌న‌సేన ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ఎవ‌రికివారుగా పోటీ చేశారు. ఇక‌, ఇప్పుడు.. వీరు క‌లిస్తే.. ఫ‌లితం బాగుంటుంద‌ని అంద‌రూ అంటున్నారు.

మ‌రోవైపు.. జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీకి స‌రైన మార్కులు ప‌డ‌క‌పోవ‌డం.. వారిసిద్ధాంతాల‌తో ఇటీవల కాలంలో జ‌న‌సేన నేత‌లు విభేదిస్తున్న నేప‌థ్యంలో బాబు-ప‌వ‌న్ భేష‌జాలు ప‌క్క‌న పెడితే.. స‌క్సెస్ అందుకోవ‌డం.. పెద్ద క‌ష్టం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో బీజేపీ – జ‌న‌సేన పేరుకు మాత్ర‌మే మిత్రులుగా ఉన్నాయి. అయితే క్షేత్ర‌స్థాయిలో ఈ రెండు పార్టీల నాయ‌కులు మాత్రం క‌ల‌సి ప‌నిచేయ‌డం లేదు. అయితే మిత్రులుగా లేక‌పోయినా టీడీపీ – జ‌న‌సేన మాత్రం చాలా విష‌యాల్లో కలిసే ప‌ని చేస్తున్నాయి.

This post was last modified on September 22, 2021 11:25 am

Share
Show comments

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

10 minutes ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

3 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

13 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

13 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

13 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

15 hours ago