Political News

సైలెంట్ గా పనిచేసుకెళుతున్న రేవంత్

కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి చాలా సైలెంట్ గా తనపనేదో తాను చేసుకునెళిపోతున్నారు. తెలంగాణా చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కేసీయార్ పై రేవంత్ పెద్ద యుద్ధమే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతమంది సీనియర్లు తనతో కలిసొస్తారనే విషయాన్ని పక్కనపెట్టేసి తనతో కలిసొచ్చే నేతలతోనే యుద్ధాన్ని ప్రారంభించేశారు. ఇదే సమయంలో తనంటే వ్యతిరేకంగా ఉండే సీనియర్లను నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మద్దతు ఇవ్వాలని రిక్వెస్టు చేస్తున్నారు.

సొంతపార్టీ నేతల మద్దతును పక్కన పెట్టేస్తే ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు రెడీ అయిపోయారు. ఇందులో ఓ విధంగా సక్సెస్ సాధించినట్లే అనుకోవాలి. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయాలని రేవంత్ ఈమధ్యనే పిలుపిచ్చారు. ఇందులో భాంగానే వాయపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలకు కూడా ఆహ్వనాలన పంపారు. రేవంత్ ఆహ్వానాన్ని అందుకున్న పార్టీల్లో సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐ ఎంఎల్, తెలంగాణా ఇంటిపార్టీ, పీవైఎల్, పీడీఎస్యూ లాంటి విద్యార్ధి విభాగం కూడా సానుకూలంగా స్పందించింది.

రేవంత్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో జరిగిన సమావేశానికి పై పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. కేసీయార్ ప్రభుత్వంపై ఉమ్మడిపోరాటాలు చేయాలని డిసైడ్ చేశారు. వామపక్షాలకు ఉన్న ఓటుబ్యాంకు ఎంత, వామపక్షాల భావజాలం ఉన్న ఇతర పార్టీల బలమెంత అన్నది పక్కన పెట్టేస్తే ఐదారు పార్టీల అధినేతలతో మాట్లాడి ఐక్యపోరాటాలకు వాళ్ళని ఒప్పించటమే రేవంత్ సాధించిన విజయం.

ప్రస్తుతం వామపక్షాల బలం క్షీణించిపోతోందన్నది వాస్తవం. అయితే వీళ్ళు ఒంటరిగా పోటీచేసి గెలవలేకపోయినా ఎన్నికల ఫలితాలను ప్రభావం చూపగలరన్నది వాస్తవం. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వామపక్షాలు, సీపీఐఎంఎల్ బలంగా ఉన్నాయి. వీటికున్న ఓటుబ్యాంకుతో గెలుపోటములను కచ్చితంగా డిసైడ్ చేయగలవు. ఇలాంటి పార్టీలు రేపటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తే హస్తంపార్టీకి మెరుగైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏమిటంటే కేసీయార్ కోవర్టులే అని ఇప్పటికే బలమైన ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటు కేసీయార్ కు అనుకూలంగా పనిచేస్తున్నారంటు కొంతమంది సీనియర్ నేతలపై ఆరోపణలున్నాయి. అందుకనే కేసీయార్ కోవర్టులందరు స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవాలంటు రేవంత్ రెడ్డి ఆమధ్య ఇచ్చిన పిలుపు సంచలనమైంది. పార్టీని కోవర్టుల నుండి రేవంత్ రక్షించుకోగలిగితే ఇతర పార్టీల పొత్తుతో ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలే వస్తాయని అనుంటున్నారు. మరి ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.

This post was last modified on September 21, 2021 12:04 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…

35 mins ago

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

46 mins ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

1 hour ago

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

2 hours ago

`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని…

2 hours ago

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

4 hours ago