Political News

సైలెంట్ గా పనిచేసుకెళుతున్న రేవంత్

కొత్తగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి చాలా సైలెంట్ గా తనపనేదో తాను చేసుకునెళిపోతున్నారు. తెలంగాణా చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కేసీయార్ పై రేవంత్ పెద్ద యుద్ధమే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతమంది సీనియర్లు తనతో కలిసొస్తారనే విషయాన్ని పక్కనపెట్టేసి తనతో కలిసొచ్చే నేతలతోనే యుద్ధాన్ని ప్రారంభించేశారు. ఇదే సమయంలో తనంటే వ్యతిరేకంగా ఉండే సీనియర్లను నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి మద్దతు ఇవ్వాలని రిక్వెస్టు చేస్తున్నారు.

సొంతపార్టీ నేతల మద్దతును పక్కన పెట్టేస్తే ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు రెడీ అయిపోయారు. ఇందులో ఓ విధంగా సక్సెస్ సాధించినట్లే అనుకోవాలి. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయాలని రేవంత్ ఈమధ్యనే పిలుపిచ్చారు. ఇందులో భాంగానే వాయపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలకు కూడా ఆహ్వనాలన పంపారు. రేవంత్ ఆహ్వానాన్ని అందుకున్న పార్టీల్లో సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐ ఎంఎల్, తెలంగాణా ఇంటిపార్టీ, పీవైఎల్, పీడీఎస్యూ లాంటి విద్యార్ధి విభాగం కూడా సానుకూలంగా స్పందించింది.

రేవంత్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో జరిగిన సమావేశానికి పై పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. కేసీయార్ ప్రభుత్వంపై ఉమ్మడిపోరాటాలు చేయాలని డిసైడ్ చేశారు. వామపక్షాలకు ఉన్న ఓటుబ్యాంకు ఎంత, వామపక్షాల భావజాలం ఉన్న ఇతర పార్టీల బలమెంత అన్నది పక్కన పెట్టేస్తే ఐదారు పార్టీల అధినేతలతో మాట్లాడి ఐక్యపోరాటాలకు వాళ్ళని ఒప్పించటమే రేవంత్ సాధించిన విజయం.

ప్రస్తుతం వామపక్షాల బలం క్షీణించిపోతోందన్నది వాస్తవం. అయితే వీళ్ళు ఒంటరిగా పోటీచేసి గెలవలేకపోయినా ఎన్నికల ఫలితాలను ప్రభావం చూపగలరన్నది వాస్తవం. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వామపక్షాలు, సీపీఐఎంఎల్ బలంగా ఉన్నాయి. వీటికున్న ఓటుబ్యాంకుతో గెలుపోటములను కచ్చితంగా డిసైడ్ చేయగలవు. ఇలాంటి పార్టీలు రేపటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తే హస్తంపార్టీకి మెరుగైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏమిటంటే కేసీయార్ కోవర్టులే అని ఇప్పటికే బలమైన ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటు కేసీయార్ కు అనుకూలంగా పనిచేస్తున్నారంటు కొంతమంది సీనియర్ నేతలపై ఆరోపణలున్నాయి. అందుకనే కేసీయార్ కోవర్టులందరు స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవాలంటు రేవంత్ రెడ్డి ఆమధ్య ఇచ్చిన పిలుపు సంచలనమైంది. పార్టీని కోవర్టుల నుండి రేవంత్ రక్షించుకోగలిగితే ఇతర పార్టీల పొత్తుతో ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలే వస్తాయని అనుంటున్నారు. మరి ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.

This post was last modified on September 21, 2021 12:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

4 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

5 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

7 hours ago