Political News

షాక్.. శ్రామిక్ రైళ్లలో 80 మంది చనిపోయారు

షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇంతకాలం గుట్టుగా ఉంచిన ఈ వ్యవహారం ఇప్పుడు కలకలంగా మారుతోంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు.. సందేహాలకు తావిస్తోంది. లాక్ డౌన్ వేళ.. సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది కిలోమీటర్లు కాలి నడకన వలసకార్మికులు వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చాలా ఆలస్యంగా.. అలాంటి వలసకూలీల్ని వారి స్వస్థలాలకు చేర్చేందుకు వీలుగా కేంద్రం శ్రామిక్ రైళ్ల పేరుతో సర్వీసుల్ని నడపాలని డిసైడ్ చేయటం తెలిసిందే. రెగ్యులర్ ట్రైన్లకు మించిన ఛార్జీలతో పాలు.. సర్ ఛార్జిని సైతం విధిస్తూ నడిపిన ఈ ట్రైన్లు మోడీ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి.

ఈ ట్రైన్ల ద్వారా ఇప్పటికే లక్షలాదిమందిని వారి స్వస్థలాలకు చేర్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తొలుత రోజుకు 40 రైళ్లు నడిపేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైతే.. అన్ని ట్రైన్లలో వచ్చే తమ ప్రజల్ని.. వారి సొంతూళ్లకు చేర్చటం కష్టమవుతుందని ఆయా రాష్ట్రాల వారు చేతులు ఎత్తేశారు. దీంతో.. పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపింది కేసీఆర్ సర్కారు. చాలా రాష్ట్రాల్లోనూ ఇలాంటి విధానాన్నే అనుసరించారు. అలా రైళ్లలో ప్రయాణించి.. వారి సొంతూళ్లకు క్షేమంగా చేరినట్లుగా ఇంతకాలం భావించారు.

ఇలాంటివేళ.. రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వలసకార్మికుల్లో 80 మంది వరకు మరణించినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు కరోనాతో మరణించగా.. మిగిలిన వారు అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆనారోగ్య సమస్యలు ఏమిటంటే.. వివిధ రకాలైన అనారోగ్యాలు అన్న మాట చెబుతున్నారే కానీ.. మిగిలిన వివరాలు వెల్లడించలేదు.

ఈ మరణాలపై మరిన్ని ప్రశ్నలు సంధించిన విలేకరులకు ఆయన సమాధానం చెప్పకుండా.. దాటవేసే ప్రయత్నం చేశారు. మరణాలపైన విచారణ జరుగుతోందని.. దీనికి సంబంధించిన నివేదిక వచ్చాక వెల్లడిస్తామన్న ఆయన మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఇంతకీ.. అంత పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం ఏమిటి? దానికి కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడో మిస్టరీగా మారాయని చెప్పక తప్పదు.

This post was last modified on May 31, 2020 2:29 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

30 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago