Political News

షాక్.. శ్రామిక్ రైళ్లలో 80 మంది చనిపోయారు

షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇంతకాలం గుట్టుగా ఉంచిన ఈ వ్యవహారం ఇప్పుడు కలకలంగా మారుతోంది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు.. సందేహాలకు తావిస్తోంది. లాక్ డౌన్ వేళ.. సొంతూళ్లకు వెళ్లేందుకు వందలాది కిలోమీటర్లు కాలి నడకన వలసకార్మికులు వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చాలా ఆలస్యంగా.. అలాంటి వలసకూలీల్ని వారి స్వస్థలాలకు చేర్చేందుకు వీలుగా కేంద్రం శ్రామిక్ రైళ్ల పేరుతో సర్వీసుల్ని నడపాలని డిసైడ్ చేయటం తెలిసిందే. రెగ్యులర్ ట్రైన్లకు మించిన ఛార్జీలతో పాలు.. సర్ ఛార్జిని సైతం విధిస్తూ నడిపిన ఈ ట్రైన్లు మోడీ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి.

ఈ ట్రైన్ల ద్వారా ఇప్పటికే లక్షలాదిమందిని వారి స్వస్థలాలకు చేర్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తొలుత రోజుకు 40 రైళ్లు నడిపేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైతే.. అన్ని ట్రైన్లలో వచ్చే తమ ప్రజల్ని.. వారి సొంతూళ్లకు చేర్చటం కష్టమవుతుందని ఆయా రాష్ట్రాల వారు చేతులు ఎత్తేశారు. దీంతో.. పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపింది కేసీఆర్ సర్కారు. చాలా రాష్ట్రాల్లోనూ ఇలాంటి విధానాన్నే అనుసరించారు. అలా రైళ్లలో ప్రయాణించి.. వారి సొంతూళ్లకు క్షేమంగా చేరినట్లుగా ఇంతకాలం భావించారు.

ఇలాంటివేళ.. రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వలసకార్మికుల్లో 80 మంది వరకు మరణించినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు కరోనాతో మరణించగా.. మిగిలిన వారు అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆనారోగ్య సమస్యలు ఏమిటంటే.. వివిధ రకాలైన అనారోగ్యాలు అన్న మాట చెబుతున్నారే కానీ.. మిగిలిన వివరాలు వెల్లడించలేదు.

ఈ మరణాలపై మరిన్ని ప్రశ్నలు సంధించిన విలేకరులకు ఆయన సమాధానం చెప్పకుండా.. దాటవేసే ప్రయత్నం చేశారు. మరణాలపైన విచారణ జరుగుతోందని.. దీనికి సంబంధించిన నివేదిక వచ్చాక వెల్లడిస్తామన్న ఆయన మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఇంతకీ.. అంత పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం ఏమిటి? దానికి కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడో మిస్టరీగా మారాయని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

3 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

5 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

7 hours ago

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…

8 hours ago

తడబడుతున్న వైభవ్… ఒక్క సిక్స్ లేదు

ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…

9 hours ago

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…

9 hours ago