Political News

కిలో బంగాళదుంపలు 3 వేల రూపాయలట

అమెరికా నిష్క్రమణ, తాలిబన్ల దురాక్రమణ తర్వాత ఆప్ఘనిస్ధాన్లోని ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలుసా ? జనాల బతుకులు దుర్భరమైయాయి. దేశంలోని కోట్లాది మంది ప్రజలు మూడు పూటల కడుపునిండా తిండి తిని ఎన్నో రోజులైందట. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల ఆకలిని తీర్చటానికి యజమానులు, ఇంటి పెద్దలు ఇంట్లోని విలువైన వస్తువులను అమ్మేసుకుంటున్నారు. తమ వస్తువులకు ఎంత ధర వస్తే అంతే చాలన్న ఆత్రంతా ఇంట్లోని వస్తువులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తున్నారు.

రాజధాని కాబూల్ లో జనాల పరిస్థితి ఎలాగుందో దేశంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపు ఒకేలాగుంది. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫా సెట్లు, బీరువాలు, కార్లు, మోటార్ బైకులు ఒకటేమిటి కొనేవారుంటే అన్నింటినీ అమ్మేసుకుంటున్నారు. ఈ మధ్యనే రు. 25 వేలు పెట్టి కొనుగోలు చేసిన పెద్ద రిఫ్రిజిరేటర్ ను లాల్ గుల్ అనే వ్యాపారి కేవలం రు. 5 వేలకే అమ్మేశాడు.

ఎందుకంటే కుటుంబ సభ్యులకు భోజనం పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవట. మూడు పూటల భోజనం చేసి కనీసం వారం రోజులైందని లాల్ గుల్ చేప్పటం చూస్తుంటే ఎంతటి దుర్భర పరిస్ధితులు రాజ్యమేలుతున్నాయో అర్ధమైపోతోంది. తొందరలోనే దేశంలోని జనాభాలో కనీసం 2 కోట్లమందికి తినటానికి తిండి కూడా దొరకదని 15 రోజుల క్రితమే ఐక్యరాజ్యసమితి నిపుణులు ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రెండు వారాల క్రితం నిపుణుల అంచనాలే ఇపుడు నిజాలయ్యాయి.

కాబూల్ లోని ఏ ప్రాంతంలో చూసినా ఇళ్ళముందు వస్తువులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే అన్నింటినీ అమ్మకానికి పెట్టేశారు కాబట్టి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే దాదాపు అందరి ఇళ్ళల్లోని పరిస్థితి ఒకేలాగుండటం, అందరు కూడా తమ ఇళ్ళల్లోని వస్తువులను అమ్మకానికి పెట్టేయటంతో కొనేవాళ్ళు కనబడటంలేదు.  దాంతో డిమాండ్ పడిపోయి సప్లై విపరీతంగా పెరిగిపోయింది. అందుకనే లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కొత్త సోఫాసెట్టును కేవలం రు. 10 వేలకు అమ్ముకున్నట్లు ఓ ఇంటి యజమాని చెప్పారు.

ఆప్ఘన్ను తాలిబన్లు ఆక్రమించుకుని దాదాపు నెల దాటింది. అప్పటినుండి పరిస్థితులు రోజు రోజుకు దరిద్రంగా తయారవుతోంది. ఆర్థిక సంక్షోభంలో యావత్ దేశం కూరుకుపోయింది. ఓ మాదిరి ధనిక కుటుంబం కూడా కిలో బంగాళదుంపలు కొని చాలా రోజులైందట. ఎందుకంటే కిలో బంగాళదుంపలు మన కరెన్సీలో సుమారు 3 వేల రూపాయలట. బయట నుండి ఆహారం దిగుమతులు ఆగిపోయాయి. బ్యాంకులు కూడా సరిగా పనిచేయటం లేదు. ఉన్న డబ్బంతా తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. దాంతో ఏమి చేయాలో జనాలకు అర్థం కావటం లేదు.

This post was last modified on September 18, 2021 2:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

14 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago