మెగా బ్రదర్ నాగబాబు దూకుడు ఎంతమాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారి తీస్తున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. అగ్రెసివ్ కామెంట్లతో దూసుకెళ్లిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ చర్చలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. బాలయ్య, తెలుగుదేశం అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
నాగబాబును బూతులు తిడుతూ టీడీపీ ఫ్యాన్స్ వీడియోలు పెట్టారు. దీనికి బదులుగా నాగబాబు శుక్రవారం రాత్రి ఒక కుక్క ఫొటో పెట్టి.. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసే ప్రమాదకర సీజన్ ఇప్పుడు నడుస్తోందని.. వాటిని నియంత్రించకపోతే చాలా ప్రమాదమని పరోక్షంగా తనను తిడుతున్న వారిని కౌంటర్ చేసే ప్రయత్నం చేశాడు.
ఇక శనివారం నాగబాబు తెలుగుదేశం అభిమానుల్ని డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోదని ఆయన తీర్మానించేశారు. మళ్లీ అధికారం దక్కుతుందనుకుంటే అది ఒక భ్రాంతే అని నాగబాబు అన్నారు.
‘‘ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో, జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీ లేదు. అభివృద్ధి అంతా టీవీల్లో పేపర్లలో తప్ప .. నిజంగా చేసింది చాలా తక్కువ. గ్రౌండ్లో కనిపించింది తక్కువ. అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ.. అబ్బో ఇంకా చాలవున్నాయి. ఈ ట్విట్టర్ ఏం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక తర్వాత మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి ఇల్యూషన్స్ లోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే దే ఆర్ వెల్కమ్. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని హ్యాలూజినేషన్స్ అంటారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాలూజినేషన్స్’’ అని నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
This post was last modified on May 30, 2020 5:03 pm
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…