Political News

టీడీపీకి మాత్రం ఛాన్సే లేదు-నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు దూకుడు ఎంతమాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారి తీస్తున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. అగ్రెసివ్ కామెంట్లతో దూసుకెళ్లిపోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ చర్చలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. బాలయ్య, తెలుగుదేశం అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

నాగబాబును బూతులు తిడుతూ టీడీపీ ఫ్యాన్స్ వీడియోలు పెట్టారు. దీనికి బదులుగా నాగబాబు శుక్రవారం రాత్రి ఒక కుక్క ఫొటో పెట్టి.. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసే ప్రమాదకర సీజన్ ఇప్పుడు నడుస్తోందని.. వాటిని నియంత్రించకపోతే చాలా ప్రమాదమని పరోక్షంగా తనను తిడుతున్న వారిని కౌంటర్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇక శనివారం నాగబాబు తెలుగుదేశం అభిమానుల్ని డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోదని ఆయన తీర్మానించేశారు. మళ్లీ అధికారం దక్కుతుందనుకుంటే అది ఒక భ్రాంతే అని నాగబాబు అన్నారు.

‘‘ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో, జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీ లేదు. అభివృద్ధి అంతా టీవీల్లో పేపర్లలో తప్ప .. నిజంగా చేసింది చాలా తక్కువ. గ్రౌండ్లో కనిపించింది తక్కువ. అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ.. అబ్బో ఇంకా చాలవున్నాయి. ఈ ట్విట్టర్ ఏం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక తర్వాత మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి ఇల్యూషన్స్ లోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే దే ఆర్ వెల్కమ్. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని హ్యాలూజినేషన్స్ అంటారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాలూజినేషన్స్’’ అని నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.

Satya

Recent Posts

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

16 minutes ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

29 minutes ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

2 hours ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

2 hours ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

4 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

5 hours ago