మెగా బ్రదర్ నాగబాబు దూకుడు ఎంతమాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు దారి తీస్తున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. అగ్రెసివ్ కామెంట్లతో దూసుకెళ్లిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ చర్చలకు సంబంధించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. బాలయ్య, తెలుగుదేశం అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
నాగబాబును బూతులు తిడుతూ టీడీపీ ఫ్యాన్స్ వీడియోలు పెట్టారు. దీనికి బదులుగా నాగబాబు శుక్రవారం రాత్రి ఒక కుక్క ఫొటో పెట్టి.. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసే ప్రమాదకర సీజన్ ఇప్పుడు నడుస్తోందని.. వాటిని నియంత్రించకపోతే చాలా ప్రమాదమని పరోక్షంగా తనను తిడుతున్న వారిని కౌంటర్ చేసే ప్రయత్నం చేశాడు.
ఇక శనివారం నాగబాబు తెలుగుదేశం అభిమానుల్ని డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోదని ఆయన తీర్మానించేశారు. మళ్లీ అధికారం దక్కుతుందనుకుంటే అది ఒక భ్రాంతే అని నాగబాబు అన్నారు.
‘‘ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో, జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీ లేదు. అభివృద్ధి అంతా టీవీల్లో పేపర్లలో తప్ప .. నిజంగా చేసింది చాలా తక్కువ. గ్రౌండ్లో కనిపించింది తక్కువ. అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ.. అబ్బో ఇంకా చాలవున్నాయి. ఈ ట్విట్టర్ ఏం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక తర్వాత మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి ఇల్యూషన్స్ లోంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలో జీవిస్తాం అంటే దే ఆర్ వెల్కమ్. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి పరిస్థితిని హ్యాలూజినేషన్స్ అంటారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాలూజినేషన్స్’’ అని నాగబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
This post was last modified on May 30, 2020 5:03 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…