తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర సంకటంగా మారిన ప్రధాన అంశం.. వినాయక చవితి ఉత్సవాలు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం! ఇటీవల కాలంలో కరోనా తీవ్రత ప్రబలిన నేపథ్యంలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే విషయంపై వైద్యులు.. నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ హైకోర్టులో ఈ విషయంపై ప్రధానంగా కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన.. ధర్మాసనం.. తక్కువ మందితో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కకేసీఆర్ ప్రభుత్వం ఒడ్డున పడింది.
ఇక, ఇంతలోనే.. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత.. నిమజ్జన ఘట్టంపై.. పర్యావరణ ప్రేమికులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. హుసేన్ సాగర్.. కలుషితం అవుతోందని,, నిమజ్జనాలపై నిషేధం విధించాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ దఫా ప్రబుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. భక్తుల మనోభావాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పర్యావరణం ముఖ్యం కాదా? అంటే.. మంత్రిని సోషల్ మీడియాలో ఏకేశారు.
ఇక, హైకోర్టు నిమజ్జనాల విషయంలో ఆంక్షలు విధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇస్తూనే.. కొన్ని ఆంక్షలు విధించింది. ప్రభుత్వానినికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు ఇవీ..
This post was last modified on September 16, 2021 4:29 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…