తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర సంకటంగా మారిన ప్రధాన అంశం.. వినాయక చవితి ఉత్సవాలు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం! ఇటీవల కాలంలో కరోనా తీవ్రత ప్రబలిన నేపథ్యంలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే విషయంపై వైద్యులు.. నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ హైకోర్టులో ఈ విషయంపై ప్రధానంగా కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన.. ధర్మాసనం.. తక్కువ మందితో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కకేసీఆర్ ప్రభుత్వం ఒడ్డున పడింది.
ఇక, ఇంతలోనే.. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత.. నిమజ్జన ఘట్టంపై.. పర్యావరణ ప్రేమికులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. హుసేన్ సాగర్.. కలుషితం అవుతోందని,, నిమజ్జనాలపై నిషేధం విధించాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ దఫా ప్రబుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. భక్తుల మనోభావాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పర్యావరణం ముఖ్యం కాదా? అంటే.. మంత్రిని సోషల్ మీడియాలో ఏకేశారు.
ఇక, హైకోర్టు నిమజ్జనాల విషయంలో ఆంక్షలు విధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇస్తూనే.. కొన్ని ఆంక్షలు విధించింది. ప్రభుత్వానినికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు ఇవీ..
This post was last modified on September 16, 2021 4:29 pm
గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…