తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర సంకటంగా మారిన ప్రధాన అంశం.. వినాయక చవితి ఉత్సవాలు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం! ఇటీవల కాలంలో కరోనా తీవ్రత ప్రబలిన నేపథ్యంలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే విషయంపై వైద్యులు.. నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ హైకోర్టులో ఈ విషయంపై ప్రధానంగా కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన.. ధర్మాసనం.. తక్కువ మందితో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కకేసీఆర్ ప్రభుత్వం ఒడ్డున పడింది.
ఇక, ఇంతలోనే.. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత.. నిమజ్జన ఘట్టంపై.. పర్యావరణ ప్రేమికులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. హుసేన్ సాగర్.. కలుషితం అవుతోందని,, నిమజ్జనాలపై నిషేధం విధించాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ దఫా ప్రబుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. భక్తుల మనోభావాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పర్యావరణం ముఖ్యం కాదా? అంటే.. మంత్రిని సోషల్ మీడియాలో ఏకేశారు.
ఇక, హైకోర్టు నిమజ్జనాల విషయంలో ఆంక్షలు విధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇస్తూనే.. కొన్ని ఆంక్షలు విధించింది. ప్రభుత్వానినికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు ఇవీ..
This post was last modified on September 16, 2021 4:29 pm
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…