తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర సంకటంగా మారిన ప్రధాన అంశం.. వినాయక చవితి ఉత్సవాలు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం! ఇటీవల కాలంలో కరోనా తీవ్రత ప్రబలిన నేపథ్యంలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే విషయంపై వైద్యులు.. నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ హైకోర్టులో ఈ విషయంపై ప్రధానంగా కేసు నమోదైంది. దీంతో విచారణ చేపట్టిన.. ధర్మాసనం.. తక్కువ మందితో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కకేసీఆర్ ప్రభుత్వం ఒడ్డున పడింది.
ఇక, ఇంతలోనే.. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత.. నిమజ్జన ఘట్టంపై.. పర్యావరణ ప్రేమికులు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. హుసేన్ సాగర్.. కలుషితం అవుతోందని,, నిమజ్జనాలపై నిషేధం విధించాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ దఫా ప్రబుత్వ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. భక్తుల మనోభావాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పర్యావరణం ముఖ్యం కాదా? అంటే.. మంత్రిని సోషల్ మీడియాలో ఏకేశారు.
ఇక, హైకోర్టు నిమజ్జనాల విషయంలో ఆంక్షలు విధించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇస్తూనే.. కొన్ని ఆంక్షలు విధించింది. ప్రభుత్వానినికి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు ఇవీ..
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…