Political News

మావోయిస్టు అగ్రనేతల్లో కలవరం

గతంలో ఎప్పుడూ లేనట్లుగా మావోయిస్టులు లొంగిపోవటంపై అగ్రనేతల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవటంతో మావోయిస్టు ఉద్యమం బలహీనమైపోతోంది. ఇదే సమయంలో ఉన్నవారిలో కూడా లొంగిపోవాలనే ఆలోచనలు పెరిగిపోతుండటంతో అగ్రనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచరం ప్రకారం గడచిన రెండేళ్ళల్లో సుమారు 171 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

లొంగిపోయిన వారంతా కీలకమైన నేతలు కాకపోయినా వివిధస్ధాయిలో పనిచేసేవారే కావటం గమనార్హం. మావోయిస్టు అగ్రనేతలను ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే గడచిన రెండేళ్ళుగా లొంగుబాట్లు ఎక్కువైపోవటం. ఇదే సమయంలో ఎన్ కౌంటర్లు కూడా ఎక్కువైపోతోంది. నిర్భంధ లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు, స్వచ్చంధ లొంగుబాట్లకు తోడు అనారోగ్యాలు బాగా పట్టి పీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ సమస్య కూడా మావోయిస్టులను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ కారణంగా కీలక నేతలతో పాటు దిగువస్థాయి క్యాడర్ చాలా ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర కార్యదర్శి హరి భూషణ్ మరణించారు. చర్ల-శబరి ఏరియా కమిటి కార్యదర్శి హరిభూషణ్ భార్య శారద కూడా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆవిడ కూడా ఈ రోజో రేపో లొంగిపోతున్నారని సమాచారం. ములుగు జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు లొంగిపోయేందుకు ఓ ప్రజాప్రతినిధి ద్వారా పోలీసు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

దండకారణ్యం, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం ఏరియాల్లో ఉండే మావోయిస్టు దళ సభ్యుల్లో చాలామంది ఇప్పటికే లొంగిపోయారు. ఎక్కడో అడవుల్లో తిరుగుతూ కుటుంబ సభ్యులకు, అయిన వాళ్లకు దూరంగా ఉండటం, తరచూ అనారోగ్యం పాలవ్వటం, ఎప్పుడు ఎన్ కౌంటర్ అయిపోతామే తెలీని భయంతోనే ఎక్కువగా లొంగుబాట్లు ఉంటున్నాయి. పోయిన సంవత్సరంలో 50 మంది లొంగిపోతే ఈ ఏడాది ఇప్పటికే 42 మంది పోలీసుల ముందు లొంగిపోయారు. వీరు కాకుండా సానుభూతిపరులు, కొరియర్లు మరో 52 మంది కూడా లొంగిపోయారు. మొత్తం మీద మావోయిస్టుల్లో అయితే టెన్షన్ పెరిగిపోతోందనేది ఖాయం.

This post was last modified on September 14, 2021 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago