Political News

జగన్ భుజం తట్టిన బీజేపీ

ఇటీవలి వరకు టీటీడీ ఆస్తుల అంశంపై పలువురు బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు రామ్ మాధవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు జగన్ ధృడ సంకల్పంతో కృషి చేస్తున్నారని ప్రశంసించడం గమనార్హం.

దేవదాయ ఆస్తుల అంశాన్ని సాధుసంతుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏపీకి, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు బీజేపీ, ఎన్డీయేకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.

విభజన చట్టంలోని హామీలతో పాటు అంతకుమించి కొత్తగా ఏర్పడిన ఏపీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించేందుకు ప్రధాని మోడీ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఏపీకి ఎంత ఎక్కువ ఇవ్వగలమో అంతమేరకు సకారాత్మకంగా ఆలోచన చేసిందన్నారు. ఏపీలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ సీఎంను జవాబుదారీగా చేయాల్సిన అవసరం లేదన్నారు.

బీజేపీకే చెందిన ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో అయినా ఆయన రాజ్యాంగ పరిధికి లోబడి పని చేయాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా చురకలు అంటించడం గమనార్హం.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై మాట్లాడుతూ.. ఇది వైసీపీ సర్కార్‌కు కనువిప్పు అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుందని ప్రభుత్వం పెద్దలు ఇకనైనా తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల అధికారులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గ్రహించాలన్నారు.

This post was last modified on May 31, 2020 12:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: BJPJaganTTD

Recent Posts

కెవ్వుమంటున్న ప్రమోషన్లు… భోరుమంటున్న కలెక్షన్లు

వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…

56 minutes ago

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

3 hours ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

8 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

9 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

9 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

10 hours ago