నరేంద్ర మోడీ సర్కార్ ప్రైవేటీకరణలో చాలా స్పీడు పెంచుతోంది. ఇందులో భాగంగానే రైళ్లతో పాటు రైళ్ళ బోగీలను అమ్మకానికి, లీజుకు, అద్దెకు కూడా ఇచ్చేయాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పర్యాటక శాఖ, సినిమా రంగాల్లో బాగా అభివృద్ధి జరగటానికి అవకాశాలున్నట్లు కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. రైళ్ళను, బోగీలను అద్దెకు ఇవ్వటం వల్ల సాంస్కృతిక, పర్యాటక, సినిమాతో పాటు మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో స్పీడ్ పెరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ భావిస్తోంది.
రైళ్ళ బోగీలను కొనుక్కున్న వాళ్ళు, అద్దెకు తీసుకున్న వాళ్ళు వాటిని ఏ పద్ధతిలో నిర్వహించాలని అనుకుంటున్నారనే విషయాన్ని ముందుగానే రైల్వేశాఖకు చెప్పాల్సుంటుంది. ఎందుకంటే రైళ్ళను కొనుక్కోవటమంటే ఏదో కారును కొని ఇంట్లో పార్కు చేసుకున్నట్లు కాదు. రైళ్లు నిలపాలంటే అందుకు కచ్చితంగా ప్లాట్ ఫారంలు ఉండాల్సిందే కదా. ప్లాట్ ఫారం ఉండాలంటే అందుకు ముందుగానే ఒప్పందాలు చేసుకోవాల్సుంటంది. ఎందుకంటే రన్నింగ్ ట్రైన్లను నిలపాలంటే ప్లాట్ ఫారాల్లో ముందుగానే బుక్ చేసుకోవాలి.
ఒకవైపు రైల్వేశాఖ ఆధీనంలోని రైళ్ళు మరోవైపు ప్రైవేటు రంగంలో రైళ్ళను నిలపటంతో ప్రయాణికుల్లో అయోమయం ఏర్పడకూడదు. అందుకనే రైళ్ళను నిలిపి ఉండే ప్లాట్ ఫారంల విషయంలో స్పష్టత కోసం రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ళను లీజు, అద్దెకు తీసుకునే వాళ్ళు కనీసం 16 బోగీలను తీసుకోవాలనే నిబంధన పెట్టింది. తాము తీసుకున్న రైళ్ళను ఏ రూటులో నడపాలని అనుకుంటున్నారు ? ఎన్ని ట్రిప్పులు తిప్పాలని అనుకుంటున్నారు ? అనే విషయాలను ముందుగానే రైల్వేశాఖకు చెప్పాల్సుంటంది.
రైళ్ళను లీజు, అద్దెలకు తీసుకునే సినీ నిర్మాతలకు ప్రయాణానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. తమ యూనిట్ మొత్తాన్ని ఒకేసారి షూటింగులు జరుపుకునే ప్రాంతాలకు తరలించవచ్చు. అలాగే కాశీ, ప్రయాగ, తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్ళాలంటే టూరిజం ట్రిప్పులను నిర్వహించే పర్యాటక రంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే కారణాలు ఏవైనా, సౌకర్యాలు ఏమైనా కానీండి ప్రభుత్వ ఆస్తులను అమ్మేయటంలో నరేంద్ర మోడీ సర్కార్ చాలా స్పీడుగా ఉందని మాత్రం అర్థమవుతోంది.
This post was last modified on September 13, 2021 11:38 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…