Political News

పవన్ కళ్యాణ్‌పై పడ్డ నార్త్ ఇండియన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఉన్నట్లుండి జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఆయన మీద నిన్న ఉదయం నుంచి హిందీలో పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతుండటం విశేషం. రాజకీయాల్లో పవన్ నిస్వార్థ పోరాటం గురించి నార్త్ ఇండియన్స్ పొగడ్తలు గుప్పిస్తూ ట్వీట్లు వేస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ పేరు హిందీలో నిన్న ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయింది. ఈ రోజు కూడా ఈ ఒరవడి కొనసాగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేయడంపై ఇటీవల ఎంత పెద్ద రగడ జరిగిందో తెలిసిందే. ఈ విషయం జాతీయ స్థాయికి వెళ్లేలా చేయడంలో పవన్ పాత్ర కూడా ఉంది. ఆయన చేసిన ట్వీట్లు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యాయి. నేషనల్ ఛానెళ్లు కూడా దీనిపై చర్చ పెట్టాయి. ఐతే పవన్ ఈ ఇష్యూను ఎత్తుకున్న తర్వాత ఒక్క రోజులోనే టీటీడీ భూముల అమ్మకంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ విషయంలో పవన్ కృషిని గుర్తు చేస్తూ నార్త్ ఇండియన్స్‌ ట్వీట్లు వేస్తున్నారు. ఇంకా అతన చేసిన పలు మంచి కార్యక్రమాల్ని, పోరాటాల్ని గుర్తు చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఇందులో జనసేన మిత్ర పార్టీ భాజపా ప్రమేయం కూడా ఉంటే ఉండొచ్చు. బీజేపీ ప్రోగా పేరున్న రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి సైతం పవన్ మీద హిందీలో ట్వీట్ వేశాడు.

ఐతే తమ నాయకుడి పేరు హిందీలో ట్రెండ్ అవుతుండటంతో జనసేన మద్దతుదారులు, పవన్ సినీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. వాళ్లు అదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. వీళ్ల హడావుడి ఎక్కువైపోయింది. దీంతో నార్త్ జనాలు వేసిన ట్వీట్లన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కొంచెం ఆలస్యంగా విషయం తెలిసి పవన్‌ మీద ఏం ట్వీట్లు వేశారో.. అతడికి ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు ఏం జరిగిందో తెలియట్లేదు.

This post was last modified on May 31, 2020 12:54 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

2 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

4 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

4 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago