ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించారు. రాష్ట్ర ఆర్థిక పరస్థితి రోజు రోజుకీ దిగజారం.. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవ్వడం రక రకాల కారణాల నేపథ్యంలో ప్రభుత్వం రజనీష్ కుమార్ ను నియమించింది.
అసలు ఎవరీ రజనీష్ కుమార్.. ఆయననే ఎందుకు నియమించారో ఇప్పుడు చూద్దాం..ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరాలు పైగా పనిచేసి, ఆ తరువాత చైర్మన్ గా 2020 అక్టోబర్ లో పదవీ విరమణ చేశారు.
ఎస్ బీఐ లో ఏడు బ్యాంకులను విలీనం చేయడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఎస్ బీఐ యోనో ప్లాట్ ఫాం ను రూపొందించడంలో రజనీష్ కుమార్ సారథ్యమే కారణం. దివాళా దిశలో వున్నా ‘ఎస్ బ్యాంక్’ను కాపాడటం ఆయన హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు కావడం విశేషం.
ప్రస్తుతం రజనీష్ హాంకాంగ్ అండ్ షంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ కు చెందిన ఆసియా విభాగానికి నాన్ –ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ గా వున్నారు. ఆ బ్యాంకు ఆసియా విభాగంలో ఆడిట్ కమిటీలో, రిస్క్ కమిటీలో సభ్యుడిగా కూడా సేవలు అందించనున్నారు. బేరింగ్ ప్రైవేటు ఈక్విటీ పార్ట్నర్స్ ఇండియాకు సలహాదారుగా 2021 ఫిబ్రవరిలో చేరారు. కోటక్ ఇన్వెస్ట్ మెంటె అడ్వయిజర్ గా ఉంటారని కోటక్ మహేంద్ర బ్యాంకు ప్రకటించింది.
కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నదనీ, అందులో తన సహకారం కోసం తనను సలహాదారుగా నియమించిందనీ రజనీష్ కుమార్ వివరణ ఇచ్చారు.
This post was last modified on September 7, 2021 2:36 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…