Political News

విమానాలకూ మిడతల ముప్పు…

భారత్ లోని పలు రాష్ట్రాల్లోని పంటపొలాలపై మిడతల దండు స్వైర విహారం చేసి తీవ్ర నష్ట కలిగించిన సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణకు మిడతల దండు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో…తాజాగా మిడతల సెగ విమానాలకూ తాకింది.

వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. కీలకలమైన ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీసీఏ సూచించింది. సాధారణంగా మిడతలు తక్కువ ఎత్తులోనే ఎగురుతుంటాయని, కాబట్టి విమానాలకు అత్యంత క్లిష్టమైన దశ అయిన ల్యాండింగ్, టేకాఫ్‌ సమయాల్లో వాటి నుంచి ముప్పు పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది.

విమానం కనుక మిడతల సమూహనం నుంచి వెళ్తే అవి ఇంజిన్‌లోకి, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని విమాన సిబ్బంది, పైలట్లను హెచ్చరించింది.

పాకిస్థాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన మిడతల దండు పంట పొలాలపై స్వైర విహారం చేస్తోంది. చేతికి అందివచ్చిన పంటను నాశనం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని పంటపొలాలపై విరుచుకుపడ్డ మిడతల దండు…ఇపుడు తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోకి మిడతలు వచ్చాయి.

కుమురం భీం జిల్లా తిర్యాణీ, సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రాణహిత ప్రాంతాల్లో మిడతల దండు తిష్ట వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇవి ఏ క్షణమైనా… కూరగాయలు, పండ్ల తోటలపై దాడి చేసే అవకాశముందని చెబుతున్నారు. వాటిని తరిమి కొట్టేందుకు పిచికారీ చేయాల్సిన రసాయనాలు, పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

This post was last modified on May 30, 2020 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

2 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

2 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

3 hours ago

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

4 hours ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

4 hours ago