Political News

అంబానీ, అదానీయే టార్గెట్టా ?

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రైతుగండం తప్పేట్లు లేదు. గడచిన తొమ్మిది నెలలుగా కంటిన్యూ అవుతున్న రైతుల ఆందోళనలో భాగంగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్లో ఆదివారం ‘కిసాన్ మహాపంచాయత్’ సభ జరిగింది. ఈ పంచాయత్ కు యూపీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి పెద్దఎత్తున రైతులు, రైతుసంఘాలు పాల్గొన్నాయి. పాల్గొన్న రైతులు, రైతు సంఘాల్లో కూడా యూపీ, పంజాబ్ నుండి పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబానీ, అదానీ యే టార్గెట్ గా మారటం ఆశ్చర్యంగా ఉంది.

తాజాగా జరిగిన కిసాన్ పంచాయత్ సమావేశంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై రైతాంగంలో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందో అర్థమైపోతోంది. యూపీలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావాలంటే రైతాంగం మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే యూపీలో రైతుల ఓట్లే అత్యధికం. ప్రస్తుతం కిసాన్ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న రాకేష్ తికాయత్ ది యూపీనే. ఈయన జాట్ల సామాజికవర్గానికి చెందిన నేత. పోయిన ఎన్నికల్లో జాట్లు ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలోని జాట్లలో అత్యధికులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాకేష్ తికాయత్ జాట్ల సామాజిక వర్గం లో తిరుగులేని నేత. తికాయత్ పిలుపు మేరకు యూపీలో ఎక్కడెక్కడయితే జాట్లున్నారో అక్కడల్లా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు గట్టిగా జరుగుతున్నాయి. తికాయత్ నాయకత్వంలో జాట్లు మాత్రమే కాకుండా ఇతర సామాజికవర్గాలకు చెందిన రైతాంగం కూడా పెద్దఎత్తున ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

గడచిన తొమ్మిది నెలలుగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్, సింగూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమంలో యూపీ, పంజాబ్ కు చెందిన రైతులే చాలా ఎక్కువ మందున్నారు. తాజాగా జరిగిన కిసాన్ మహా పంచాయత్ లో తికాయత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటు పిలుపిచ్చారు. నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మేస్తుంటే అంబానీ, అదానీలు కొనేస్తున్నారంటు తికాయత్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే పంజాబ్ లో రిలయన్స్ కు చెందిన సెల్ టవర్లు, వ్యాపార సముదాయాలపై ఒకసారి దాడులు జరిగిన విషయం తెలిసిందే.

దేశంలో మోడీ అమ్మేస్తున్న వివిధ ఆస్తులను అంబానీ, అదానీలే కొనేస్తున్నారంటూ తికాయత్ చేసిన ఆరోపణలకు రైతాంగం బాగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోను మోడి అమ్మకాలు, అంబానీ, అదానీల కొనుగోళ్లను అడ్డుకుని తీరాలంటు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న తికాయత్ పిలుపుకు రైతాంగం నూరుశాతం సంఘీభావం పాటించారు. దాంతోనే బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on September 6, 2021 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

2 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

2 hours ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

4 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

6 hours ago

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

9 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

12 hours ago