Political News

జగన్ ది అనాలోచిత నిర్ణయమేనా ?

వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికపై నిర్వహించుకోవటాన్ని ప్రభుత్వం అభ్యంతరం పెట్టిన విషయం తెలిసిందే. తన అభ్యంతరానికి కరోనా వైరస్ సమస్యను ప్రభుత్వం చెప్పింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనాలోచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా సమస్య నియంత్రణలోనే ఉందని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వర్తక, వాణిజ్య సముదాయాలు తెరవడానికి అనుమతిస్తోంది. అలాగే స్కూళ్ళు కూడా తెరిచేసింది. హోటల్, రెస్టారెంట్లతో పాటు చివరకు బార్లను కూడా బార్లా తెరుచుకోవడానికి అనుమతించింది.

దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా ఓపెన్ అయిపోయాయి. మరి ఇన్నింటికి లేని కరోనా వైరస్ సమస్య ఒక్క వినాయక చవితి వేడుకలకు మాత్రమే అడ్డొచ్చిందా ? బహిరంగ వేదికలపైన చవితి వేడుకలు నిర్వహించటమన్నది దశాబ్దాలుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బహిరంగ వేదికలపై వేడుకలు వద్దని చెప్పకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పి వేడుకలకు అనుమతిస్తే బాగుండేది. ప్రభుత్వం షరతులు విధించినా విధించకపోయినా జనాలు చేసేది చేసేదే. ఈ మాత్రం దానికి జనాలతో గొడవలు పడాల్సిన అవసరం ఏమిటో జగన్ కాస్త ఆలోచించాలి.

ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోగానే వ్యతిరేకించడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి. ప్రభుత్వం వద్దంటే ప్రతిపక్షాలు కచ్చితంగా చేయాల్సిందే అని గట్టిగా పట్టుబడతాయి. ఇపుడు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసింది కూడా అదే. బహిరంగ వేదికలపై చవితి వేడుకల వద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వీర్రాజు తప్పు పడుతున్నారు. కారణం ఏమిటంటే ప్రభుత్వం హిందూ వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుంటోందట. హిందు ధర్మం, దేవాలయాలు, సంస్కృతిపై జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందనే వాదన వినిపించారు.

అయితే వీర్రాజు వేసిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కరోనా వైరస్ ఉన్నపుడు కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది ? అని నిలదీశారు. ఒకవైపు పబ్లిక్ ప్లేసెస్ అన్నింటినీ ఓపెన్ చేయిస్తు చవితి వేడుకలను మాత్రం ఇళ్ళల్లోనే జరుపుకోవాలని చెప్పడం వెనుక హిందూమత వ్యతిరేక కుట్ర ఉందని ఆరోపించారు .

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు హిందూ వ్యతిరేకత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను జగన్ ముందుగానే అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇపుడు వినాయక చవితి వేడుకల విషయంలో కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకుంటే బాగుంటుంది. వేడుకలు బహిరంగంగా జరుపుకోకూడదని ప్రభుత్వం పట్టుబడితే ప్రతిపక్షాలు దాన్ని ఉల్లంఘించేదుకు రెడీగా ఉంటాయి. జగన్ కు ఇవన్నీ అవసరమా ? కాబట్టి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటే సరిపోతుంది.

This post was last modified on September 5, 2021 11:36 am

Share
Show comments

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

50 mins ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

58 mins ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

2 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

2 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

2 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

3 hours ago