Political News

జగన్ ది అనాలోచిత నిర్ణయమేనా ?

వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికపై నిర్వహించుకోవటాన్ని ప్రభుత్వం అభ్యంతరం పెట్టిన విషయం తెలిసిందే. తన అభ్యంతరానికి కరోనా వైరస్ సమస్యను ప్రభుత్వం చెప్పింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనాలోచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా సమస్య నియంత్రణలోనే ఉందని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వర్తక, వాణిజ్య సముదాయాలు తెరవడానికి అనుమతిస్తోంది. అలాగే స్కూళ్ళు కూడా తెరిచేసింది. హోటల్, రెస్టారెంట్లతో పాటు చివరకు బార్లను కూడా బార్లా తెరుచుకోవడానికి అనుమతించింది.

దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా ఓపెన్ అయిపోయాయి. మరి ఇన్నింటికి లేని కరోనా వైరస్ సమస్య ఒక్క వినాయక చవితి వేడుకలకు మాత్రమే అడ్డొచ్చిందా ? బహిరంగ వేదికలపైన చవితి వేడుకలు నిర్వహించటమన్నది దశాబ్దాలుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బహిరంగ వేదికలపై వేడుకలు వద్దని చెప్పకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పి వేడుకలకు అనుమతిస్తే బాగుండేది. ప్రభుత్వం షరతులు విధించినా విధించకపోయినా జనాలు చేసేది చేసేదే. ఈ మాత్రం దానికి జనాలతో గొడవలు పడాల్సిన అవసరం ఏమిటో జగన్ కాస్త ఆలోచించాలి.

ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోగానే వ్యతిరేకించడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి. ప్రభుత్వం వద్దంటే ప్రతిపక్షాలు కచ్చితంగా చేయాల్సిందే అని గట్టిగా పట్టుబడతాయి. ఇపుడు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసింది కూడా అదే. బహిరంగ వేదికలపై చవితి వేడుకల వద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వీర్రాజు తప్పు పడుతున్నారు. కారణం ఏమిటంటే ప్రభుత్వం హిందూ వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుంటోందట. హిందు ధర్మం, దేవాలయాలు, సంస్కృతిపై జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందనే వాదన వినిపించారు.

అయితే వీర్రాజు వేసిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కరోనా వైరస్ ఉన్నపుడు కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది ? అని నిలదీశారు. ఒకవైపు పబ్లిక్ ప్లేసెస్ అన్నింటినీ ఓపెన్ చేయిస్తు చవితి వేడుకలను మాత్రం ఇళ్ళల్లోనే జరుపుకోవాలని చెప్పడం వెనుక హిందూమత వ్యతిరేక కుట్ర ఉందని ఆరోపించారు .

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు హిందూ వ్యతిరేకత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను జగన్ ముందుగానే అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇపుడు వినాయక చవితి వేడుకల విషయంలో కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకుంటే బాగుంటుంది. వేడుకలు బహిరంగంగా జరుపుకోకూడదని ప్రభుత్వం పట్టుబడితే ప్రతిపక్షాలు దాన్ని ఉల్లంఘించేదుకు రెడీగా ఉంటాయి. జగన్ కు ఇవన్నీ అవసరమా ? కాబట్టి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటే సరిపోతుంది.

This post was last modified on September 5, 2021 11:36 am

Share
Show comments

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago