Political News

కోమటిరెడ్డి vs మధూయాష్కీ.. వార్ వర్డ్స్..!

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, మధు యాష్కీల మధ్య వార్ మొదలైంది. వైఎస్ సంస్మరణ సభ వీరి మధ్య చిచ్చు పెట్టడం గమనార్హం. వైఎస్ ష‌ర్మిల పార్టీ కోసం ఏర్పాటు చేసిన సంస్మ‌ర‌ణ స‌భ‌కు ఎవ‌రూ వెళ్లొద్దంటూ టీపీసీసీ ఫ‌త్వాను కాద‌ని స‌భ‌కు వెళ్లిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ మండిప‌డ్డారు.

పార్టీకి న‌ష్ట‌ప‌ర్చేలా కోమ‌టిరెడ్డి మాట్లాడ‌టం స‌రికాద‌న్న మ‌ధుయాష్కీ…. పార్టీని న‌ష్ట‌ప‌ర్చేలా మాట్లాడ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా గ‌తంలో విజ‌య‌మ్మ మాట్లాడిన మాట‌ల‌ను మీరు స‌మ‌ర్థిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పార్టీ నుండి వెళ్లిపోవాల‌నుకుంటే వెళ్లిపోవ‌చ్చ‌న్న ఆయ‌న‌… కోమ‌టిరెడ్డి ఎదుగుద‌ల‌కు సోనియానే కార‌ణ‌మ‌న్నారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. సీత‌క్క వంటి నేత‌పై కోమ‌టిరెడ్డి మాట‌లు ఆయ‌న సంస్కారానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎవరూ హైదరబాద్‌లో వైఎస్ విజయలక్ష్మి ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లవద్దని టీ పీసీసీ సూచించింది. అయితే వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని వెళ్లి తీరతానని కోమటిరెడ్డి ప్రకటించడమే కాకుండా వెళ్లారు. అక్కడకు వెళ్లి మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబుకు రాఖీ కడితే లేని తప్పు వైఎస్ సంస్మరణకు తాను వస్తే వస్తుందా అని ప్రశ్నించారు. ఇంకా పలు రకాల విమర్శలు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో.. మధుయాష్కీ.. కోమటిరెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.

This post was last modified on September 5, 2021 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago