Political News

జ‌గ‌న్ ఎక్క‌డుంటే.. అదే రాజ‌ధాని: మంత్రి మేక‌పాటి

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌ధాని విష‌యం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని.. రాజ‌ధాని రైతులు 700 రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా న‌డుస్తున్నాయి. ఈ విష‌యంలో ఒక ఉద్విగ్న‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అయితే.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రులు మాత్రం త‌ర‌చుగా అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేస్తూ.. రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా.. రాష్ట్రంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం.. అమ‌రావ‌తి రైతులు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చించేది లేద‌ని చెప్పారు. అంతేకాదు.. కేవ‌లం 20 గ్రామాల రైతులు, ఒక సామాజిక వ‌ర్గం కోసం.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్ర‌జ‌ల భ‌విత‌వ్యాన్ని నాశ‌నం చేయాలా? అని ప్ర‌శ్నించారు.

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ మంట‌లు చ‌ల్లార‌క‌ముందే.. మ‌రో మంత్రి, యువ నాయ‌కుడు మేక‌పాటి గౌతం రెడ్డి.. రాజ‌ధానిపై వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. రాజ‌ధాని విష‌యంలో మంత్రి గౌతం రెడ్డి చేసిన కామెంట్లు మళ్లీ మంట‌లు రేపుతున్నాయి.

సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు.

సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు.  ప్రస్తుతం మంత్రి వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 31, 2021 3:52 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

59 minutes ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

2 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

3 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

14 hours ago