ప్రస్తుతం ఏపీలో రాజధాని విషయం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఒకవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రాజధాని రైతులు 700 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ విషయంలో ఒక ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.
అయితే.. అధికార పార్టీ నేతలు.. మంత్రులు మాత్రం తరచుగా అమరావతిపై వ్యాఖ్యలు చేస్తూ.. రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా.. రాష్ట్రంలో చర్చ జరగడం.. అమరావతి రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తెలిసిందే.
ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ.. అమరావతి రైతులతో చర్చించేది లేదని చెప్పారు. అంతేకాదు.. కేవలం 20 గ్రామాల రైతులు, ఒక సామాజిక వర్గం కోసం.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని నాశనం చేయాలా? అని ప్రశ్నించారు.
దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అదేసమయంలో రాజధాని రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ మంటలు చల్లారకముందే.. మరో మంత్రి, యువ నాయకుడు మేకపాటి గౌతం రెడ్డి.. రాజధానిపై వివాదాస్పద కామెంట్లు చేశారు. రాజధాని విషయంలో మంత్రి గౌతం రెడ్డి చేసిన కామెంట్లు మళ్లీ మంటలు రేపుతున్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు.
సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వస్తుండడం గమనార్హం.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…