Political News

జ‌గ‌న్ ఎక్క‌డుంటే.. అదే రాజ‌ధాని: మంత్రి మేక‌పాటి

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌ధాని విష‌యం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని.. రాజ‌ధాని రైతులు 700 రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా న‌డుస్తున్నాయి. ఈ విష‌యంలో ఒక ఉద్విగ్న‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అయితే.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రులు మాత్రం త‌ర‌చుగా అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేస్తూ.. రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా.. రాష్ట్రంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం.. అమ‌రావ‌తి రైతులు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చించేది లేద‌ని చెప్పారు. అంతేకాదు.. కేవ‌లం 20 గ్రామాల రైతులు, ఒక సామాజిక వ‌ర్గం కోసం.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్ర‌జ‌ల భ‌విత‌వ్యాన్ని నాశ‌నం చేయాలా? అని ప్ర‌శ్నించారు.

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ మంట‌లు చ‌ల్లార‌క‌ముందే.. మ‌రో మంత్రి, యువ నాయ‌కుడు మేక‌పాటి గౌతం రెడ్డి.. రాజ‌ధానిపై వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. రాజ‌ధాని విష‌యంలో మంత్రి గౌతం రెడ్డి చేసిన కామెంట్లు మళ్లీ మంట‌లు రేపుతున్నాయి.

సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు.

సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు.  ప్రస్తుతం మంత్రి వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 31, 2021 3:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

11 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

12 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

13 hours ago