సెప్టెంబరు ఒకటి నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కారణంగా ఆన్ లైన్ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. తాజాగా ప్రభుత్వం స్కూళ్లను ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. స్కూళ్లు ఓపెన్ చేయటం.. కచ్ఛితంగా స్కూళ్లకు వెళ్లాల్సిందే అన్నది సరి కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణ కోసం.. విద్యార్థుల్ని తప్పనిసరిగా రావాలంటూ బలవంతం చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నేరుగా స్కూళ్లకు రాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. బడికి రావాలా? వద్దా? అన్న అంశంపై విద్యార్థుల ఇష్టానికి వదిలేయాలని పేర్కొంది. అంతేకాదు.. స్కూళ్లు ఓపెన్ చేయకుండా ఆన్ లైన్ లో మాత్రమే పాఠాలు బోధించే విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవద్దని.. ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ క్లాసుల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.
ప్రత్యక్ష బోధన చేసే విద్యా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలని.. ఇందుకు వారం గడువును ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. స్కూళ్లు.. కాలేజీల క్లాసుల నిర్వహణ మీద విద్యార్థులు.. విద్యా సంస్థల ఇష్టానికి వదిలేసిన హైకోర్టు.. హాస్టల్స్ విషయంలో మాత్రం.. స్టే ఇవ్వటం గమనార్హం.
గురుకులాలు.. విద్యాసంస్థల్లో హాస్టల్స్ తెరవొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ ఉన్న వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు.. అక్టోబరులో మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు జారీ అవుతున్న వేళ.. స్కూళ్లు తెరవటంపై లాభనష్టాలు రెండూ ఉన్నాయని చెప్పింది. విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నట్లుగా చెప్పిన హైకోర్టు.. రెండు అంశాల్ని సమన్వయం చేసుకోవాలని పేర్కొంది.
ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబరు నాలుగుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. హాస్టల్స్ తెరిచే విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి స్టే ఇచ్చిన హైకోర్టు.. స్కూళ్ల ఓపెనింగ్ మీద మాత్రం ‘తప్పనిసరి’ అన్నది లేకుండా ఎవరి వెసులుబాటుకు తగ్గట్లు వారు వ్యవహరించాలన్నట్లుగా హైకోర్టు పేర్కొన్నట్లుగా చెప్పొచ్చు.
This post was last modified on August 31, 2021 2:15 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…