తెలంగాణలో కేసీఆర్ కి పంటికింద రాయిలాగా.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తగులుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా… కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. రేవంత్ ని ఓడించేందుకు భారీ కసరత్తే జరిగింది. రేవంత్ కి కంచుకోటలా ఉండే కొడంగల్ లోనే.. ఆయనను స్వల్ప మెజార్టీతో ఓడించారు. రేవంత్ ని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాల్లో సఫలమయ్యారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలా ఓడించడం అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకే.. ఇప్పటి నుంచే ఆ కొడంగల్ నియోజకవర్గాన్ని.. టీఆర్ఎస్ తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని ఇప్పటి నుంచే భారీ స్కెచ్చులు వేస్తోంది. ఈక్రమంలో కొడంగల్ పై కేసీఆర్ తన స్టైల్లో వల వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
దళిత బంధులాగే.. అన్ని వర్గాలకు అలాంటి పథకమే తీసుకొస్తానని చెప్తున్నారు కేసీఆర్. ఈక్రమంలో కొడంగల్లో గిరిజన బంధు ఆస్త్రాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 10 శాతానికి పైగా ఓట్లు ఆ సామాజికవర్గానికి చెందినవే ఉండటంతో గిరిజన బంధు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ను ఎంచుకోవాలని అనుకుంటున్నారట.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తుండటంతో.. ఆయనకు అదే దారిలో కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ ఇటీవల కొడంగల్లో నిర్వహించిన సర్వేల్లో అన్ని వర్గాల్లోనూ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనిపించిందని తెలుస్తోంది. అందుకే.. రేవంత్ కి వ్యతిరేకంగా అక్కడి ప్రజలను ఆకర్షించేలా.. ఈ గిరిజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 31, 2021 7:30 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…