జనసేనాని పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలను ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి తన పక్షాన, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవ డం తెలుగువారి సౌభాగ్యమని పవన్ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషగా మార్చి అందరికీ చేరువయ్యే లా చేసిన ఘనత గిడుగు వంటి మహానుభావులదైతే .. ఈనాటి పాలకులు తెలుగును కనుమరుగు చేసే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు.
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది’ అనే రీతిలో కొందరు పాలకులు(జగన్ను ఉద్దేశించి అని విశ్లేషకుల భావన) వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత ఆరోపించారు. ఓట్ల వ్యామోహంలో వైసీపీ నాయకులు కొట్టుకుపోతున్నారని విమర్శించారు. తెలుగు భాషకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గుండె బరువెక్కక మానదని ఆవేదన చెందారు. ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పు డు ఐదో స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో అయిదు దశాబ్దాలలో తెలుగు అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు.
మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయన్న పెద్దల మాటలను విస్మరించరాదని హితవు పలికారు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుందన్నారు. మన అమ్మ భాషను బతికించుకోడానికి తెలుగు వారందరూ నడుంకట్టాలని పిలుపునిచ్చారు. పాలకులు ఏదో చేస్తారులే అన్న భావం విడనాడాలన్నారు. భాషాభిమానులు, స్వచ్చంధ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని.. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు, సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉందన్నారు.. భాషాపరమైన గ్రంథాల ముద్రణకు ముందుకు రావాలని.. ఊరికో తెలుగు భాషా సంఘం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. మొత్తానికి అవకాశం ఎలా వచ్చినా.. జగన్ను విడిచిపెట్టకుండా..రాజకీయంగా విమర్శించడం గమనార్హం.
This post was last modified on August 29, 2021 5:33 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…