విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీపికబురు అందించారు. ఇప్పటి వరకు వారు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నారైలు భారత్కు వచ్చినప్పుడు.. వారు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దాదాపు 6 నెలలు పట్టేది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే.. ఇప్పుడు మోడీ సర్కారు ఈ విషయంలో కొంత సడలింపు ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాల మేరకు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్న యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఓ ప్రకటన జారీ చేసింది.
స్వదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే, దీనికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఇండియన్ పాస్పోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఓ ట్వీట్ చేసింది. “ఎన్నారైలు ఇకపై ఆధార్ దరఖాస్తు కోసం 182 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. చెల్లుబాటయ్యే భారతీయ పాస్పోర్టు ఉన్న ప్రవాస భారతీయులు స్వదేశానికి రాగానే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ఇతర వివరాల కోసం 1947 ఫోన్ చేయవచ్చు. లేదా help@uidai.gov.inకు మెయిల్ చేయండి” అంటూ యూఐడీఏఐ ట్వీట్ చేసింది.
ప్రవాస భారతీయులు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం కూడా వివరించింది.. అదేంటంటే.. మొదట సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్పోర్టు తీసుకెళ్లడం తప్పనిసరి. నమోదు దరఖాస్తు ఫారంలో వివరాలు నింపాలి. ఎన్నారైలు ఈ-మెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి. ఇక ప్రవాస భారతీయులకు డిక్లరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కనుక జాగ్రత్తగా చదివిన తర్వాత సంతకం పెట్టాలి. తనను ఎన్నారైగా నమోదు చేయాల్సిందిగా ఆపరేటర్ను ప్రత్యేకంగా అడగాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మీ పాస్పోర్టు ఇవ్వాలి. బయోమెట్రిక్ క్యాప్చర్ ప్రాసెస్ను కూడా జాగ్రత్తగా పూర్తి చేయాలి. 14 అంకెలతో ఉండే దరఖాస్తు స్లిప్ను తీసుకోవడం మరిచిపోకూడదు. ఈ స్లిప్లో దరఖాస్తు ఐడీ, తేదీ, సమయం ఉంటాయి. ఇవి మీ దరఖాస్తు స్టేటస్ను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అని పేర్కొంది. మొత్తంగా ఇది ఎన్నారైలు ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న సమస్యకు పరిష్కారం చూపించినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 27, 2021 10:33 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…