‘తమకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిది’ అని తాలిబన్లు తాజాగా చేసిన ప్రకటన చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశాన్ని అస్ధిరతపాల్చేయటం, మారణహోమాన్ని రేపటమే లక్ష్యాలుగా పాకిస్ధాన్ ఎన్ని కుట్రలు పన్నుతోందో అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ అవలంభిస్తున్న భారత్ వ్యతిరేకతను మనదేశం ఎండగడుతునే ఉంది.
తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన పరిణామాలను మన పాలకులు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్ధాన్+పాకిస్ధాన్+చైనా దేశాల నుండి మనకు ముప్పు ఎదురవుతుందేమో అనే ఆందోళన మన పాలకుల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన తాలిబన్ల పాలన, అరాచకాలకు తెరవెనుక పాకిస్థాన్, చైనాయే ఉందని యావత్ ప్రపంచం అనుమానిస్తోంది.
ఇలాంటి నేపధ్యంలోనే పాకిస్థాన్ తమకు రెండో ఇల్లు లాంటిదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించడం గమనార్హం. పాకిస్థాన్ తో తమ దేశం వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమంటే ఇప్పటికే సంబంధాలున్నాయని అంగీకరించడమే. ఈ విషయాన్ని మన పాలకులు మొదటి నుంచి నెత్తీ నోరు మొత్తుకుంటున్నది.
మన దేశానికి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు, తాలిబన్లు ఒకటే. ఎందుకంటే తన అవసరాలకు పాక్ పాలకులు చాలాకాలంగా తాలిబన్లను ఉపయోగించుకుంటున్న విషయం బయటపడినా పాక్ పాలకులు మాత్రం అంగీకరించటం లేదు. పాకిస్థాన్ తో తమకున్న సంబంధాలను ఎవరూ విడదీయలేరని చెప్పటంతోనే తాలిబన్లకు పాకిస్తాన్ ఎంతగా మద్దతుగా నిలుస్తోందో ప్రపంచానికి మరోసారి తెలిసివస్తోంది. మొత్తానికి తాలిబన్లు చేసిన తాజా ప్రకటనతో పాకిస్తాన్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది.
This post was last modified on August 27, 2021 10:19 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…