Political News

పాకిస్థాన్ తో బంధాన్ని బయటపెట్టిన తాలిబన్లు

‘తమకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిది’ అని తాలిబన్లు తాజాగా చేసిన ప్రకటన చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశాన్ని అస్ధిరతపాల్చేయటం, మారణహోమాన్ని రేపటమే లక్ష్యాలుగా పాకిస్ధాన్ ఎన్ని కుట్రలు పన్నుతోందో అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ అవలంభిస్తున్న భారత్ వ్యతిరేకతను మనదేశం ఎండగడుతునే ఉంది.

తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన పరిణామాలను మన పాలకులు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్ధాన్+పాకిస్ధాన్+చైనా దేశాల నుండి మనకు ముప్పు ఎదురవుతుందేమో అనే ఆందోళన మన పాలకుల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన తాలిబన్ల పాలన, అరాచకాలకు తెరవెనుక పాకిస్థాన్, చైనాయే ఉందని యావత్ ప్రపంచం అనుమానిస్తోంది.

ఇలాంటి నేపధ్యంలోనే పాకిస్థాన్ తమకు రెండో ఇల్లు లాంటిదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించడం గమనార్హం. పాకిస్థాన్ తో తమ దేశం వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమంటే ఇప్పటికే సంబంధాలున్నాయని అంగీకరించడమే. ఈ విషయాన్ని మన పాలకులు మొదటి నుంచి నెత్తీ నోరు మొత్తుకుంటున్నది.

మన దేశానికి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు, తాలిబన్లు ఒకటే. ఎందుకంటే తన అవసరాలకు పాక్ పాలకులు చాలాకాలంగా తాలిబన్లను ఉపయోగించుకుంటున్న విషయం బయటపడినా పాక్ పాలకులు మాత్రం అంగీకరించటం లేదు. పాకిస్థాన్ తో తమకున్న సంబంధాలను ఎవరూ విడదీయలేరని చెప్పటంతోనే తాలిబన్లకు పాకిస్తాన్ ఎంతగా మద్దతుగా నిలుస్తోందో ప్రపంచానికి మరోసారి తెలిసివస్తోంది. మొత్తానికి తాలిబన్లు చేసిన తాజా ప్రకటనతో పాకిస్తాన్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది.

This post was last modified on August 27, 2021 10:19 pm

Share
Show comments
Published by
suman
Tags: Taliban

Recent Posts

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

27 mins ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

1 hour ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

2 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

3 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

4 hours ago