‘తమకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిది’ అని తాలిబన్లు తాజాగా చేసిన ప్రకటన చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశాన్ని అస్ధిరతపాల్చేయటం, మారణహోమాన్ని రేపటమే లక్ష్యాలుగా పాకిస్ధాన్ ఎన్ని కుట్రలు పన్నుతోందో అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ అవలంభిస్తున్న భారత్ వ్యతిరేకతను మనదేశం ఎండగడుతునే ఉంది.
తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన పరిణామాలను మన పాలకులు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్ధాన్+పాకిస్ధాన్+చైనా దేశాల నుండి మనకు ముప్పు ఎదురవుతుందేమో అనే ఆందోళన మన పాలకుల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన తాలిబన్ల పాలన, అరాచకాలకు తెరవెనుక పాకిస్థాన్, చైనాయే ఉందని యావత్ ప్రపంచం అనుమానిస్తోంది.
ఇలాంటి నేపధ్యంలోనే పాకిస్థాన్ తమకు రెండో ఇల్లు లాంటిదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించడం గమనార్హం. పాకిస్థాన్ తో తమ దేశం వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పటమంటే ఇప్పటికే సంబంధాలున్నాయని అంగీకరించడమే. ఈ విషయాన్ని మన పాలకులు మొదటి నుంచి నెత్తీ నోరు మొత్తుకుంటున్నది.
మన దేశానికి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు, తాలిబన్లు ఒకటే. ఎందుకంటే తన అవసరాలకు పాక్ పాలకులు చాలాకాలంగా తాలిబన్లను ఉపయోగించుకుంటున్న విషయం బయటపడినా పాక్ పాలకులు మాత్రం అంగీకరించటం లేదు. పాకిస్థాన్ తో తమకున్న సంబంధాలను ఎవరూ విడదీయలేరని చెప్పటంతోనే తాలిబన్లకు పాకిస్తాన్ ఎంతగా మద్దతుగా నిలుస్తోందో ప్రపంచానికి మరోసారి తెలిసివస్తోంది. మొత్తానికి తాలిబన్లు చేసిన తాజా ప్రకటనతో పాకిస్తాన్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది.
This post was last modified on August 27, 2021 10:19 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…