ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ టూర్ కి వెళుతున్నారు. రేపటి నుంచి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన చేయనున్నారు.
రేపు మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ…. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరనుంది. ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేరుకోనుంది.
ఈ నెల 28న జగన్, భారతిల పెళ్లి దినోత్సవం ఉంది. పెళ్లి అయ్యి 25 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాగా ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల బెయిల్ రద్దు అంశంపై సీబీఐ కోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
ఈ విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ బెయిల్ను రద్దు అంశంపై వచ్చే నెల 15వ తేదీన తీర్పు ప్రకటిస్తామని వెల్లడించింది.
This post was last modified on August 25, 2021 7:28 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…