ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ టూర్ కి వెళుతున్నారు. రేపటి నుంచి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన చేయనున్నారు.
రేపు మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ…. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరనుంది. ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేరుకోనుంది.
ఈ నెల 28న జగన్, భారతిల పెళ్లి దినోత్సవం ఉంది. పెళ్లి అయ్యి 25 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాగా ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల బెయిల్ రద్దు అంశంపై సీబీఐ కోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
ఈ విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ బెయిల్ను రద్దు అంశంపై వచ్చే నెల 15వ తేదీన తీర్పు ప్రకటిస్తామని వెల్లడించింది.
This post was last modified on August 25, 2021 7:28 pm
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…