సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ కి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. సజ్జనార్ ను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ సీపీ నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం … సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
మూడేళ్లకు పైగా సైబరాబాద్ సి పి గా పనిచేసిన సజ్జనార్… తాజాగా ఆ పదవి నుంచి బదిలీ అయ్యారు. ఇక అటు సైబరాబాద్ సిపి గా స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే… వీరిని ఎందుకు బదిలీ చేసిందనే దాని పై ఇంకా క్లారిటి రాలేదు. కాగా… సైబరాబాద్ సీపీ గా సజ్జనార్… మంచి పేరు తెచ్చుకున్నారు. దిశ మరియు వరంగల్ యాసిడ్ కేసులలో నిందితులను ఎనకౌంటర్ చేసి సీపీ సజ్జనార్… దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ ని కూడా మార్చారు. ప్రస్తుతం ఉన్న ప్రభాకర్ రావును తప్పించి… ట్రాఫిక్ అదనపు సీపీగా ఉన్న అనిల్ కుమార్ ను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించింది ప్రభుత్వం. అనిల్ కుమార్ 1996 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఇక అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్ కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా అనిల్ నియామకంతో ఎస్ఐబీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చుడనున్నారు ప్రభాకర్ రావు.
This post was last modified on August 25, 2021 4:05 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…