Political News

బెయిల్ పై పెరుగుతున్న ఉత్కంఠ

బెయిల్ రద్దుపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దుచేయాలంటు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై ఈరోజు సీబీఐ కోర్టు తీర్పు చెప్పబోతోంది. ఈ కేసుకు సంబంధించిన వాద, ప్రతిపాదనలను కోర్టు జూలైలోనే ముగించింది. బెయిల్ రద్దుచేసి ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్నది తిరుగుబాటు ఎంపి పట్టుదలగా ఉంది.

జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, భయపడెతున్నారంటు పదే పదే రఘురామ ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలను మాత్రం ఎక్కడ చూపలేదు. బెయిల్ షరతులను జగన్ ఎలా ఉల్లంఘిస్తున్నారో కూడా చెప్పలేకపోయారు. తన బెయిల్ ను కంటిన్యు చేయాలని జగన్ వాదిస్తున్నారు. సాక్ష్యులను ప్రభావితం చేయలేదని జగన్ చెబుతున్నారు.

ఈ మొత్తంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేశారా ? లేదా ? ప్రలోభాలకు గురిచేశారా అనే విషయాన్ని తేల్చాల్సింది సీబీఐ అధికారులే. సాక్ష్యులను ప్రభావితం చేసినట్లు, ప్రలోభాలకు గురిచేసినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదు. నిజానికి జగన్ బెయిల్ విషయంలో అభ్యంతరం చెప్పాల్సిందే సీబీఐ. కానీ సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోయినా కేసులతో కానీ విచారణతో కానీ ఎలాంటి సంబంధంలేని రఘురామ బెయిల్ రద్దుకు పిటీషన్ వేయటమే విచిత్రం.

సరే ఆ దశలన్నీ దాటిపోయి చివరకు తీర్పు చెప్పేరోజు వచ్చేసింది. సో సీబీఐ ప్రత్యేక కోర్టు ఏమని తీర్పు చెబుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. బెయిల్ రద్దయితే ఏమవుతుంది ? అనే విషయమై రాజకీయపార్టీలతో పాటు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. తన పిటీషన్ను కోర్టు కొట్టేస్తే తాను హైకోర్టుకు అవసరమైతే సుప్రింకోర్టుకు వెళటానికి రెడీగా ఉన్నట్లు తిరుగుబాటు ఎంపి గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. మరి కోర్టు ఏమని తీర్పుచెబుతుందో చూద్దాం.

This post was last modified on August 25, 2021 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

18 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

3 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago