Political News

ఇంటి ముందు టూలెట్ బోర్డు.. జరిమానా వేసిన జీహెచ్ఎంసీ

మీ ఇంటి ముందు.. మీ అపార్ట్ మెంట్ ముందు.. ఇల్లు అద్దెకు ఉందని పెట్టే బోర్డు.. లేదంటూ చిన్నపాటి ఫ్లెక్సీకి ఫైన్ వేస్తే? ఇదెక్కడి అన్యాయమండి? అంత పెద్ద తప్పేం జరిగిందండి? ఇల్లు అద్దెకు ఉందని.. ఎవరికైనా ఎట్లా తెలుస్తుందండి? లాంటి క్వశ్చన్లు మందిలోకి వస్తున్నాయా? ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే.. వాటితో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుపోవటం జీహెచ్ఎంసీ గొప్పతనం. ఇప్పటివరకు ఎప్పుడూ వినని.. చూడని రీతిలో ఫైన్లు వేస్తూ షాకిస్తోంది.

తాజాగా ఇల్లు అద్దెకు ఇస్తామంటూ.. ఇంటి ముందు తగిలించిన ఒకమోస్తరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే.. దానికి ఫైన్ వేసి దిమ్మ తిరిగిపోయేలా చేశారు. ఎందుకిలా? అంటే.. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ బదులివ్వటం గమనార్హం. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే బహిరంగ ప్రచారాల మీద నిషేధం ఉందంటూ మరో ఆసక్తికరమైన విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. సదరు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇంటి యజమానికి రూ.2వేలు ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇదిప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ ఈ వ్యవహారం ఎక్కడ చోటు చేసుకున్నదంటే..

మోతీనగర్ పరిధిలోని మూసాపేట డివిజన్ లోని ఒక దుకాణా యజమాని ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డుకు జీహెచ్ఎంసీ అధికారులు రూ.2వేలు ఫైన్ వేశారు. స్థానిక వ్యాపారి లాలయ్యగౌడ్ కు చెందిన ఇల్లు ఖాళీ అయ్యింది. దీంతో.. టూ లెట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇది నేరమంటూ జీహెచ్ఎంసీ ఈడీ.. డీఎం డైరెక్టర్ రూ.2వేలు జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు జారీ చేసింది.

అంతేకాదు.. 24 గంటల వ్యవధిలో ఈ – చలానా ద్వారా ఫైన్ పే చేయాలని చెప్పటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో టూలెట్ బోర్డులు ఏర్పాటు చేసినోళ్ల వేలాది మంది పరిస్థితి ఏమిటి? మరి.. టూలెట్ బోర్డు పెట్టాలంటే ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి? అందుకు ఎంత తిరగాలి? లాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ తీరు షాకింగ్ గా మారింది.

This post was last modified on August 25, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago