కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీకి వచ్చిందా? ఆయన ఇక, తమకు దూరమేనని.. మానసికంగా సిద్ధమైందా ? అంటే.. తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్ల కిందట.. తెలంగాణలో పర్యటించిన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. కేరళకు చెందిన ఊమెన్ చాందీ.. చిరంజీవి తమ పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన సంచలనం రేపింది. అయితే.. ఆ వెంటనే ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు తదితరులు కాదు.. కాదు.. చిరు తమతోనే ఉన్నారని ప్రకటించారు.
ఇక, ఏపీ కాంగ్రెస్ చీఫ్ సాకే శైలజానాథ్ కూడా చిరును వెనుకేసుకు వచ్చారు. ఆయన కేవలం సినిమాల్లో బిజీగా ఉండడంతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని.. ప్రకటించారు. దీంతో ఇది నిజమేనేమో.. అని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా జరిగిన పరిణామాలను బట్టి.. చూస్తే.. చిరుతో కాంగ్రెస్కు దాదాపు తెగతెంపులు అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. చిరును ఇప్పుడు అటు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కానీ, ఇటు ఏపీలోని నేతలు కానీ.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి ప్రధాన నిదర్శనం.. ఆయన తాజాగా పుట్టిన రోజు జరుపుకొన్నారు.
అయితే..చిరు పుట్టిన రోజు నాడు.. గతంలో కాంగ్రెస్ నేతలు పుంఖాను పుంఖాలుగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపేవారు. అదే సమయంలో తెలంగాణలో అయితే..కీలక నేతలు, మాజీ మంత్రులు ఆయన నివాసానికి చేరుకుని పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించేవారు. ఇక, ఏపీ నుంచి కూడా నేతలు క్యూ కట్టి చిరు నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెప్పి..ఫొటోలకు ఫోజులు ఇచ్చేవారు. కానీ, ఇప్పడు ఆ ఊసు ఎక్కడా కనిపించలేదు. పోనీ.. ఇప్పుడు కరోనా ఉందని అనుకున్నా.. డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని భావించినా.. ట్విట్టర్లు ఉన్నాయి, మీడియా ఉంది.. కానీ.. ఏ ఒక్కరూ చిరును పట్టించుకోలేదు.
చిరు కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వెరసి మొత్తంగా.. కాంగ్రెస్కు చిరు దూరమైనట్టేనని అంటున్నారు పరిశీలకులు. విచిత్రం ఏంటంటే చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపితే అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోలేదు.
This post was last modified on August 24, 2021 3:49 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…