దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ మధ్య కాస్త కేసులు తగ్గినట్లే అనిపించినా.. మళ్లీ పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో.. థర్డ్ వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజలు అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గులేరియా అన్నారు. బయట అడుగు పెడితే కచ్చితంగా మాస్క్లను ధరించాలని, టీకాలను వేసుకున్నా, వేసుకోకపోయినా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని, సబ్బుతో చేతులను బాగా కడుక్కోవాలని అన్నారు.
పండుగ సీజన్ కనుక ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గులేరియా అన్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త అవసరమని అన్నారు. కోవిడ్ 19 కు చెందిన డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలను వేయించుకోవాలని గులేరియా అన్నారు. కరోనాను నివారించేందుకు టీకాలను వేయించుకోవడం ఒక్కటే మార్గమన్నారు. టీకా వేసుకుంటే కోవిడ్ ఒక వేళ వచ్చినా తీవ్రత చాలా తగ్గుతుందని, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, కనుక కచ్చితంగా టీకాలను వేయించుకోవాలని సూచించారు.
This post was last modified on August 20, 2021 6:10 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…