Political News

కరోనా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్ చీఫ్ హెచ్చరికలు..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ మధ్య కాస్త కేసులు తగ్గినట్లే అనిపించినా.. మళ్లీ పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో.. థర్డ్ వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

ప్ర‌జ‌లు అవ‌స‌రం ఉంటే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని గులేరియా అన్నారు. బ‌య‌ట అడుగు పెడితే క‌చ్చితంగా మాస్క్‌ల‌ను ధ‌రించాల‌ని, టీకాల‌ను వేసుకున్నా, వేసుకోక‌పోయినా త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని అన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాల‌ని, స‌బ్బుతో చేతుల‌ను బాగా క‌డుక్కోవాల‌ని అన్నారు.

పండుగ సీజ‌న్ క‌నుక ప్ర‌జ‌లు కోవిడ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని గులేరియా అన్నారు. ఇంత‌కు ముందు క‌న్నా ఇప్పుడే ఇంకాస్త ఎక్కువ జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌ని అన్నారు. కోవిడ్ 19 కు చెందిన డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు.

ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా టీకాల‌ను వేయించుకోవాల‌ని గులేరియా అన్నారు. క‌రోనాను నివారించేందుకు టీకాల‌ను వేయించుకోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌న్నారు. టీకా వేసుకుంటే కోవిడ్ ఒక వేళ వ‌చ్చినా తీవ్ర‌త చాలా త‌గ్గుతుంద‌ని, ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని, క‌నుక క‌చ్చితంగా టీకాల‌ను వేయించుకోవాల‌ని సూచించారు.

This post was last modified on August 20, 2021 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

2 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

7 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

9 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

13 hours ago