దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆ మధ్య కాస్త కేసులు తగ్గినట్లే అనిపించినా.. మళ్లీ పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో.. థర్డ్ వేవ్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.కోవిడ్ మూడో వేవ్ వస్తుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజలు అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గులేరియా అన్నారు. బయట అడుగు పెడితే కచ్చితంగా మాస్క్లను ధరించాలని, టీకాలను వేసుకున్నా, వేసుకోకపోయినా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని, సబ్బుతో చేతులను బాగా కడుక్కోవాలని అన్నారు.
పండుగ సీజన్ కనుక ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గులేరియా అన్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త అవసరమని అన్నారు. కోవిడ్ 19 కు చెందిన డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలను వేయించుకోవాలని గులేరియా అన్నారు. కరోనాను నివారించేందుకు టీకాలను వేయించుకోవడం ఒక్కటే మార్గమన్నారు. టీకా వేసుకుంటే కోవిడ్ ఒక వేళ వచ్చినా తీవ్రత చాలా తగ్గుతుందని, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, కనుక కచ్చితంగా టీకాలను వేయించుకోవాలని సూచించారు.
This post was last modified on August 20, 2021 6:10 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…