లాక్ డౌన్ అంటే వామ్మో అన్న వాళ్లంతా ఇప్పుడు ఆ మాటను లైట్ తీసుకుంటున్నారు. రెండో దశ లాక్ డౌన్ వరకు చాలా కఠినంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మూడో దశ నుంచి మినహాయింపులు మొదలుపెట్టాయి. నాలుగో దశలో చాలా వరకు షరతులన్నీ ఎత్తేశారు. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. థియేటర్లు, పెద్ద షాపింగ్ మాల్స్పై మాత్రమే ఆంక్షలున్నాయి.
రాజకీయ, మతపరమైన సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగుతోంది. రాత్రి వేళల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీని వల్ల జనాలకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న సమయంలో ఈ మినహాయింపులేంటి అన్న ప్రశ్నలు వస్తున్నప్పటికీ.. ఇంతకుమించి జనాల్ని కట్టడి చేస్తే చాలా కష్టమని భావించి ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చేశాయి.
కొన్ని పరిమితుల మధ్య నామమాత్రంగా నడుస్తున్న నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత ఏంటి అన్నదానిపై స్పష్టత లేదు. ఇంతకుముందు లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా.. అందరిలోనూ ఉత్కంఠగా ఉండేది. లాక్ డౌన్ను పొడిగిస్తారా.. ఏమైనా మినహాయింపులు ఇస్తారా అని చూసేవాళ్లు. ప్రధాని లేదంటే రాష్ట్ర సీఎం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఏదో ప్రకటన చేయబోతున్నారని అనగానే కౌంట్ డౌన్ మొదలైపోయేది. నిర్ణీత సమయానికి టీవీల ముందు వాలిపోయారు. కానీ ఇప్పుడు అలాంటి ఉత్కంఠ ఏమాత్రం లేదు.
లాక్ డౌన్ పొడిగింపు, మినహాయింపుల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారట. తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండబోతోందట. లాక్ డౌన్ను మళ్లీ పొడిగిస్తారట.. ఇదీ తాజా మీడియా సమాచారం. ఐతే ఇప్పుడెలాగూ లాక్ డౌన్ నామమాత్రంగానే నడుస్తుండటంతో పొడిగించినా పోయేదేముంది అన్నట్లు జనాలు లైట్ తీసుకుంటున్నారు. మినహాయింపు విషయంలోనూ ఆసక్తి ఏమీ లేదు. గత ప్రెస్ మీట్లలో మాదిరి ఈసారి కేసీఆర్ ఏం చెబుతారా అని జనాలు టీవీల ముందు వాలిపోయే పరిస్థితి లేనట్లే.
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…