లాక్ డౌన్ అంటే వామ్మో అన్న వాళ్లంతా ఇప్పుడు ఆ మాటను లైట్ తీసుకుంటున్నారు. రెండో దశ లాక్ డౌన్ వరకు చాలా కఠినంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మూడో దశ నుంచి మినహాయింపులు మొదలుపెట్టాయి. నాలుగో దశలో చాలా వరకు షరతులన్నీ ఎత్తేశారు. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. థియేటర్లు, పెద్ద షాపింగ్ మాల్స్పై మాత్రమే ఆంక్షలున్నాయి.
రాజకీయ, మతపరమైన సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగుతోంది. రాత్రి వేళల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీని వల్ల జనాలకు పెద్దగా ఇబ్బందేమీ లేదు. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న సమయంలో ఈ మినహాయింపులేంటి అన్న ప్రశ్నలు వస్తున్నప్పటికీ.. ఇంతకుమించి జనాల్ని కట్టడి చేస్తే చాలా కష్టమని భావించి ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చేశాయి.
కొన్ని పరిమితుల మధ్య నామమాత్రంగా నడుస్తున్న నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత ఏంటి అన్నదానిపై స్పష్టత లేదు. ఇంతకుముందు లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా.. అందరిలోనూ ఉత్కంఠగా ఉండేది. లాక్ డౌన్ను పొడిగిస్తారా.. ఏమైనా మినహాయింపులు ఇస్తారా అని చూసేవాళ్లు. ప్రధాని లేదంటే రాష్ట్ర సీఎం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఏదో ప్రకటన చేయబోతున్నారని అనగానే కౌంట్ డౌన్ మొదలైపోయేది. నిర్ణీత సమయానికి టీవీల ముందు వాలిపోయారు. కానీ ఇప్పుడు అలాంటి ఉత్కంఠ ఏమాత్రం లేదు.
లాక్ డౌన్ పొడిగింపు, మినహాయింపుల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారట. తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండబోతోందట. లాక్ డౌన్ను మళ్లీ పొడిగిస్తారట.. ఇదీ తాజా మీడియా సమాచారం. ఐతే ఇప్పుడెలాగూ లాక్ డౌన్ నామమాత్రంగానే నడుస్తుండటంతో పొడిగించినా పోయేదేముంది అన్నట్లు జనాలు లైట్ తీసుకుంటున్నారు. మినహాయింపు విషయంలోనూ ఆసక్తి ఏమీ లేదు. గత ప్రెస్ మీట్లలో మాదిరి ఈసారి కేసీఆర్ ఏం చెబుతారా అని జనాలు టీవీల ముందు వాలిపోయే పరిస్థితి లేనట్లే.
This post was last modified on May 27, 2020 7:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…