వైసీపీలో కీలక నేతగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా.. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు.. ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు.. గత ఎన్నికలకుముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి.. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. తన హవాను మాత్రం సాగిస్తున్నారు. అయితే.. ఎప్పుడూ.. విశాఖ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఓ మహిళతో రాసలీలలు చేశారనే వీడియో వైరల్ అవుతోంది. ఇది.. వైసీపీలో ప్రకంపనలు రేపుతుండగా.. ప్రతిపక్షాలకు వరంగా మారింది. మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. “పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. ఓ అరగంటలో పంపిస్తా.” అంటూ మంత్రి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది.
అంతేకాదు, “నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది. చెప్పిన మాట విను” అంటూ మహిళను అవంతి బతిమాలుతున్నట్లుగా ఈ ఆడియో ఉంది. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది. మంత్రి రాసలీలలపై అప్పుడే విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీ నేతృత్వంలోని ఎస్వీబీసీ.. చానెల్ చైర్మన్గా వ్యవహరించిన.. సినీ నటుడు.. పృథ్వీపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయితే.. అప్పట్లో జగన్ సీరియస్గా తీసుకుని. ఆయనను వెంటనే తప్పించారు. మరి ఇప్పుడు అవంతి విషయంలో ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 20, 2021 6:59 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…