వైసీపీలో కీలక నేతగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా.. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు.. ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు.. గత ఎన్నికలకుముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి.. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. తన హవాను మాత్రం సాగిస్తున్నారు. అయితే.. ఎప్పుడూ.. విశాఖ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఓ మహిళతో రాసలీలలు చేశారనే వీడియో వైరల్ అవుతోంది. ఇది.. వైసీపీలో ప్రకంపనలు రేపుతుండగా.. ప్రతిపక్షాలకు వరంగా మారింది. మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. “పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. ఓ అరగంటలో పంపిస్తా.” అంటూ మంత్రి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది.
అంతేకాదు, “నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది. చెప్పిన మాట విను” అంటూ మహిళను అవంతి బతిమాలుతున్నట్లుగా ఈ ఆడియో ఉంది. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది. మంత్రి రాసలీలలపై అప్పుడే విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీ నేతృత్వంలోని ఎస్వీబీసీ.. చానెల్ చైర్మన్గా వ్యవహరించిన.. సినీ నటుడు.. పృథ్వీపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయితే.. అప్పట్లో జగన్ సీరియస్గా తీసుకుని. ఆయనను వెంటనే తప్పించారు. మరి ఇప్పుడు అవంతి విషయంలో ఏం చేస్తారో చూడాలి.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…