వైసీపీలో కీలక నేతగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా.. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు.. ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందు.. గత ఎన్నికలకుముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి.. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. తన హవాను మాత్రం సాగిస్తున్నారు. అయితే.. ఎప్పుడూ.. విశాఖ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఓ మహిళతో రాసలీలలు చేశారనే వీడియో వైరల్ అవుతోంది. ఇది.. వైసీపీలో ప్రకంపనలు రేపుతుండగా.. ప్రతిపక్షాలకు వరంగా మారింది. మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. “పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. ఓ అరగంటలో పంపిస్తా.” అంటూ మంత్రి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది.
అంతేకాదు, “నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది. చెప్పిన మాట విను” అంటూ మహిళను అవంతి బతిమాలుతున్నట్లుగా ఈ ఆడియో ఉంది. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది. మంత్రి రాసలీలలపై అప్పుడే విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీ నేతృత్వంలోని ఎస్వీబీసీ.. చానెల్ చైర్మన్గా వ్యవహరించిన.. సినీ నటుడు.. పృథ్వీపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయితే.. అప్పట్లో జగన్ సీరియస్గా తీసుకుని. ఆయనను వెంటనే తప్పించారు. మరి ఇప్పుడు అవంతి విషయంలో ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 20, 2021 6:59 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…