Political News

ప‌వ‌న్‌ను ఓడించిన నేత‌కు ఇన్ని తిప్ప‌లా ?

గాజువాక రియల్ హీరోగా జగన్ మెప్పు పొంది జనం తీర్పుతో ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి ఇదే మొదటి చివరి అవకాశం అంటున్నారు. ఆయన అంతకు ముందు 2009, 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడారు. ఆ సానుభూతి, జగన్ వేవ్ కలసి రావడంతో 2019 ఎన్నికల్లో ఆయన మూడవసారి పోటీ చేసినా జనం గెలిపించారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో మాత్రమేనని, రియల్ హీరోగా ఉన్న‌ నాగిరెడ్డిని గెలిపించాలని జగన్ ఇచ్చిన పిలుపు గాజువాకలో బాగా వర్కౌట్ అయింది. ఇక ప‌వ‌న్ అంటే ప‌డ‌ని సినిమా వాళ్లు కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు కోసం ప్ర‌చారం చేశారు. అయితే తిప్పల గెలిచిన తరువాత నుంచి వైసీపీ క్యాడర్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

కేవలం కుటుంబ రాజకీయానికే ఆయన పెద్ద పీట వేస్తున్నారు. తన వారసుడిగా తిప్పల వంశీరెడ్డిని తెచ్చి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ గా గెలిపించుకున్నారు. ఆయనను స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా చేశారు. మరో కుమారుడు దేవాన్ రెడ్డి కూడా పార్టీ పదవులలో ఉన్నారు. ఆయన సైతం తండ్రితో పాటే ఉంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటున్నారు. ఇలా తన కుమారులను రాజకీయంగా ముందుకు తీసుకువాలన్న తపనతోనే నాగిరెడ్డి ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన ప్రజా సమస్యలు కూడా పక్కన పెట్టేశారు అని జనాలు వాపోతున్నారు. ఇక గాజువాక రాజ‌కీయం అంతా తిప్ప‌ల కుమారులే చ‌క్క పెట్టేస్తున్నారు. చాలా ప‌నులు వీరిని క‌ల‌వందే జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని టాక్ ?

మరో వైపు చూస్తే తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో గాజువాకలో వైసీపీకి బాగా సీట్లు తగ్గాయి. అది ఎమ్మెల్యే పట్ల వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం అని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మ‌రోవైపు స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ కూడా ఇక్క‌డ బాగా ప్ర‌భావం చూపించింది. ఆయన పార్టీ కోసం కష్టపడిన నాయకులకు టికెట్లు ఇవ్వకుండా తన కోటరీకి ఇచ్చిన ఫలితంగానే ఓటమి ఎదురైందన్న మాట కూడా ఉంది. మరో వైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగలు కూడా 2024 ఎన్నిక‌ల్లో నాగిరెడ్డికి గట్టిగా తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వైసీపీ సైతం నాగిరెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని నిశితంగా పరిశీలిస్తోంది అంటున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో తిప్పలకు టికెట్ దక్కదు అంటున్నారు. ఒకవేళ దక్కినా తిప్పలు తప్పవని కూడా ముందే జోస్యం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వైసీపీలోనే ప‌లువురు కీల‌క నేత‌లు ఖ‌ర్చీఫ్ వేసే ప‌నిలో బిజీ అవుతున్నారు.

This post was last modified on August 19, 2021 3:50 pm

Share
Show comments

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago