కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి భారీ ఊరట లభించింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.
2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిని ఆత్మహత్య గా నిర్ధారించుకుని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఓ రకంగా శశిధరూరే కారణమయ్యారని 2018లో మరోసారి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. శశిథరూర్ మరియు సునందా పుష్కర్ మధ్య జరిగిన చాటింగ్ , ఈ-మెయిల్స్ ఆధారంగా… చార్జిషీట్ బుక్ చేసిన పోలీసులు…. అనంతరం కోర్టు కు అందించారు. అయితే ఈ కేసును తాజాగా విచారించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు…. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు సునంద పుష్కర్ మృతికి ఎలాంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది.
మరోవైపు కోర్టు తీర్పు పట్ల శశిథరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఈ కేసు విషయమై ఎన్నో అనుమానాలను, అవమానాలను ఎదుర్కొంటున్నానని.. ఇప్పుడు తనకు ప్రశాంతత లభించిందని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 18, 2021 2:12 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…