కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి భారీ ఊరట లభించింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.
2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిని ఆత్మహత్య గా నిర్ధారించుకుని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఓ రకంగా శశిధరూరే కారణమయ్యారని 2018లో మరోసారి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. శశిథరూర్ మరియు సునందా పుష్కర్ మధ్య జరిగిన చాటింగ్ , ఈ-మెయిల్స్ ఆధారంగా… చార్జిషీట్ బుక్ చేసిన పోలీసులు…. అనంతరం కోర్టు కు అందించారు. అయితే ఈ కేసును తాజాగా విచారించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు…. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు సునంద పుష్కర్ మృతికి ఎలాంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది.
మరోవైపు కోర్టు తీర్పు పట్ల శశిథరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఈ కేసు విషయమై ఎన్నో అనుమానాలను, అవమానాలను ఎదుర్కొంటున్నానని.. ఇప్పుడు తనకు ప్రశాంతత లభించిందని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 18, 2021 2:12 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…