కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి భారీ ఊరట లభించింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.
2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిని ఆత్మహత్య గా నిర్ధారించుకుని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఓ రకంగా శశిధరూరే కారణమయ్యారని 2018లో మరోసారి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. శశిథరూర్ మరియు సునందా పుష్కర్ మధ్య జరిగిన చాటింగ్ , ఈ-మెయిల్స్ ఆధారంగా… చార్జిషీట్ బుక్ చేసిన పోలీసులు…. అనంతరం కోర్టు కు అందించారు. అయితే ఈ కేసును తాజాగా విచారించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు…. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు సునంద పుష్కర్ మృతికి ఎలాంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది.
మరోవైపు కోర్టు తీర్పు పట్ల శశిథరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఈ కేసు విషయమై ఎన్నో అనుమానాలను, అవమానాలను ఎదుర్కొంటున్నానని.. ఇప్పుడు తనకు ప్రశాంతత లభించిందని చెప్పుకొచ్చారు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…