దేశం నుంచి వెళుతున్న అగ్రరాజ్యం అమెరికా తాలిబన్లకు పెద్ద షాకే ఇచ్చింది. తమ బ్యాంకుల్లో ఉన్న తాలిబన్ల ఖాతాలను అమెరికా ఫ్రీజ్ చేసేసింది. నాలుగు రోజుల క్రితమే మొత్తం ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో అరాచక పాలన మొదలైంది. ఈనెల 31వ తేదీ ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికాతో పాటు నాటో సైన్యం దేశం నుంచి వెళిపోవాలన్న విషయం తెలిసిందే. దీన్ని సాకుగా తీసుకున్న తీవ్రవాదులు అందరి అంచనాలకన్నా భిన్నంగా చాలా స్పీడుగా దేశాన్ని స్వాధీనం చేసేసుకున్నారు.
అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తాలిబన్లు ఇంత స్పీడుగా యాక్ట్ చేయటం వెనుక కారణాలు ఏమిటి ? ఏమిటంటే ప్రధానంగా ఆర్ధిక వనరులన్న విషయం బయటపడింది. అత్యంత సంపన్న పది తీవ్రవాద గ్రూపుల్లో తాలిబన్లది 5వ స్ధానం. ఏడాదికి వందల మిలియన్ డాలర్ల సంపాదన ఉన్న కారణంగానే ఆర్ధికంగా తాలిబన్లు విపరీతంగా బలోపేతమయ్యారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా అందుతున్న విరాళాలు, ఓపియం లాంటి మాదక ద్రవ్యాల పంటలు పండించడమే.
ఏడాదికి ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల హయాంలో 15 వేల టన్నుల ఓపియం సాగు జరుగుతోంది. ప్రపంచంలో జరిగే ఓపియం సాగు, బిజినెస్ లో ఆఫ్ఘనిస్థాన్ వాటా 93 శాతం అంటే మామూలు విషయం కాదు. దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబన్లు ఓపియం సాగును లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు కాబట్టే వందలాది మిలియన్ డాలర్లు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సంపాదనతోనే తీవ్రవాదులు అత్యంత అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయటమే కాకుండా తమ సైన్యం అవసరాలను చూస్తున్నారు.
మరి అలా సంపాదించిన డబ్బు అంతా తాలిబన్లు ఎక్కడ దాచిపెడతారు ? ఎక్కడంటే వివిధ బ్యాంకుల్లో వివిధ సంస్ధల పేర్లతో డిపాజిట్లు చేస్తారు. ఈ విషయాన్ని గమనించిన అమెరికా తమ బ్యాంకుల్లో తాలిబన్లు దాచుకున్న నిధులను ఫ్రీజ్ చేసేసింది. తాలిబన్ల డబ్బు అమెరికాలోని వివిధ బ్యాంకుల్లో సుమారు 10 మిలియన్ డాలర్లుంటుంది. సరే అమెరికా తాలిబన్ల నిధులను ఫ్రీజ్ చేసినంత మాత్రాన ఏమవుతుంది ? ఇంకా చాలా బ్యాంకుల్లో ఖాతాలుంటాయి కదాని అనుకోవచ్చు.
ఒకసారి తాలిబన్ల అకౌంట్లను అమెరికా ఫ్రీజ్ చేస్తే మిగిలిన దేశాలు కూడా అదే పనిచేసే అవకాశాలున్నాయి. అప్పుడు తాలిబన్లకు తాత్కాలికంగానే అయినా నిధుల సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. కాకపోతే ఇపుడు ఆఫ్ఘన్లో అధికారంలోకి వచ్చేశారు కాబట్టి ఆ సమస్యను అధిగమించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా అమెరికా నిర్ణయం తాలిబన్లకు షాకిస్తాయనటంలో సందేహంలేదు.
This post was last modified on August 18, 2021 10:39 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…