Political News

వెంకయ్యపై కేంద్రమంత్రుల ఒత్తిడి ?

రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపిలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై ఏడుగురు కేంద్రమంత్రులు బాగా ఒత్తిడి తెస్తున్నట్లే ఉంది చూస్తుంటే. మొన్నటి 11వ తేదీన రాజ్యసభలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఎంపిలు పోడియం దగ్గర ఉద్యోగులు కూర్చునే బెంచీల మీదకు ఎక్కి అల్లరి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే మార్షల్స్ కు ఎంపీల మధ్య తోపులాటలు కూడా జరిగాయి.

మార్షల్స్ ను ఎంపిలు కొట్టారని కేంద్రమంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో మార్షల్సే తమపై దాడులు చేశారని ప్రతిపక్షాల ఎంపిలు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. పైగా బయటవ్యక్తులను మార్షల్స్ రూపంలో సభలోకి కేంద్రప్రభుత్వం పిలిపించిందంటు గోల చేస్తున్నారు. సరే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా కొందరు ఎంపిలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రుల నుంచి వెంకయ్యపై ఒత్తిడి పెరిగిపోతోంది.

అల్లర్లు జరిగిన రెండో రోజు నుండే ఎంపిలపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఏడుగురు కేంద్రమంత్రులు వెంకయ్యను డిమాండ్ చేశారు. అప్పటినుండి ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు డిమాండ్లు చేశారు. తాజాగా ఇదే అంశంపై ఆదివారం వెంకయ్యను కలిసి మళ్ళీ గట్టిగా డిమాండ్ చేశారు. అంటే ప్రతిపక్ష ఎంపిలపై చర్యల విషయంలో కేంద్రమంత్రులు ఓ వ్యూహం ప్రకారం నడుచుకుంటున్నారని అర్ధమవుతోంది.

ఇందులో భాగంగానే ఛైర్మన్ కూడా రాజ్యసభలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తో కలిసి పరిశీలించారు. సోమవారం అంటే ఈరోజు కూడా మరోసారి చూడబోతున్నారు. తర్వాత తన నివేదిక రూపంలో జరిగిన ఘటనను, తన సిఫారసును రాష్ట్రపతికి వివరిస్తారని సమాచారం. నిజానికి రాజ్యసభలో ఎన్డీయే కి పూర్తి మెజారిటీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. బిల్లులను పాస్ చేయించుకునే విషయంలో కేంద్రం ఇబ్బందులు పడుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు ఎంపీలపై వెంకయ్య కనుక చర్యలు తీసుకుంటే సభలో ప్రతిపక్షాల బలం తగ్గిపోతుంది. అప్పుడు సభలో బిల్లులను పాస్ చేయించుకునేందుకు ఎన్డీయే పెద్దగా కష్టపడక్కర్లేదు. అయితే సభలో పార్టీల బలాబలాలను లెక్కలు చూసిన తర్వాతే చర్యలకు రెడీ అవుతారు. కాకపోతే ఇపుడు కనుక చర్యలు తీసుకుంటే అది ఎప్పటినుండి ఎప్పటివరకు ఎఫెక్టులో ఉంటుందనేది కాస్త అయోమయంగా ఉంది. అందరు సీనియర్లే కాబట్టి అన్నీ విషయాలను చూసుకునే చర్యలకు రెడీ అవుతారు. చూద్దాం చివరకు ఏమవుతుందో.

This post was last modified on August 16, 2021 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

7 hours ago