Political News

బీజేపీ, కాంగ్రెస్ పోటీ దేనితోనే తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ నేతలు భీబత్సమైన ప్రకటనలు చేసేస్తున్నారు. విచిత్రమేమిటంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే అని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి నేతలతో గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే రెండుపార్టీలకూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా లేరన్నది వాస్తవం.

నిజానికి రెండు పార్టీలు కూడా పోటీపడాల్సింది నోటాను దాటాలనే. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 2014, 19 లో ఈ రెండు పార్టీలకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే రెండుపార్టీల మీద జనాలకు ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయింది. వాస్తవం ఇలాగుంటే రెండుపార్టీల నేతలు మాత్రం జనాలే ఆశ్చర్యపోయేస్ధాయిలో ప్రకటనలు ఇస్తుండటమే విచిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండుపార్టీలూ నోటాతో పోటీపడేట్లే ఉన్నాయి.

మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ఈ రెండు పార్టీల తరపున అసలు అభ్యర్ధులే దొరకలేదు. ఇక పోటీచేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. అప్పటి విషయమే కాదు ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అన్నీ చోట్లా పోటీచేయటానికి ఈ రెండు పార్టీలకు అభ్యర్ధులు దొరక్క చేతులెత్తేశాయి. ఇలాంటి పార్టీలు కూడా వైసీపీని సవాలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఈ మధ్యనే రాహూల్ గాంధీ ఏపి నేతలతో సమావేశమై 2024లో అధికారంలోకి వచ్చేయాలని చెప్పటమే ఆయన అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. అధికారంలోకి రావాలంటే చేయాల్సింది నేతలను పిలిపించుకుని నాలుగు గోడలమధ్య సమావేశాలు పెట్టి ఆదేశాలు ఇవ్వటంకాదు. వరుసగా రెండు ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్ధులు ఎందుకు ఒక్క నియోజకవర్గంలో గెలవలేదు ? అసలు డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు ? అని నిజాయితీగా విశ్లేషించాలి. ఇదే పద్దతిలో బీజేపీ అగ్రనేతలు కూడా విశ్లేషించుకుంటే వాస్తవాలు ఏమిటో అర్ధమవుతుంది.

This post was last modified on August 15, 2021 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

3 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

6 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

7 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

11 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

12 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

12 hours ago