వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ నేతలు భీబత్సమైన ప్రకటనలు చేసేస్తున్నారు. విచిత్రమేమిటంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే అని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి నేతలతో గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే రెండుపార్టీలకూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా లేరన్నది వాస్తవం.
నిజానికి రెండు పార్టీలు కూడా పోటీపడాల్సింది నోటాను దాటాలనే. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 2014, 19 లో ఈ రెండు పార్టీలకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే రెండుపార్టీల మీద జనాలకు ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయింది. వాస్తవం ఇలాగుంటే రెండుపార్టీల నేతలు మాత్రం జనాలే ఆశ్చర్యపోయేస్ధాయిలో ప్రకటనలు ఇస్తుండటమే విచిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండుపార్టీలూ నోటాతో పోటీపడేట్లే ఉన్నాయి.
మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ఈ రెండు పార్టీల తరపున అసలు అభ్యర్ధులే దొరకలేదు. ఇక పోటీచేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. అప్పటి విషయమే కాదు ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అన్నీ చోట్లా పోటీచేయటానికి ఈ రెండు పార్టీలకు అభ్యర్ధులు దొరక్క చేతులెత్తేశాయి. ఇలాంటి పార్టీలు కూడా వైసీపీని సవాలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ఈ మధ్యనే రాహూల్ గాంధీ ఏపి నేతలతో సమావేశమై 2024లో అధికారంలోకి వచ్చేయాలని చెప్పటమే ఆయన అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. అధికారంలోకి రావాలంటే చేయాల్సింది నేతలను పిలిపించుకుని నాలుగు గోడలమధ్య సమావేశాలు పెట్టి ఆదేశాలు ఇవ్వటంకాదు. వరుసగా రెండు ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్ధులు ఎందుకు ఒక్క నియోజకవర్గంలో గెలవలేదు ? అసలు డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు ? అని నిజాయితీగా విశ్లేషించాలి. ఇదే పద్దతిలో బీజేపీ అగ్రనేతలు కూడా విశ్లేషించుకుంటే వాస్తవాలు ఏమిటో అర్ధమవుతుంది.
This post was last modified on August 15, 2021 11:21 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…