Political News

మార‌టోరియం, మ‌ళ్లీ వ‌డ్డీనా..

క‌రోనా-లాక్ డౌన్ కార‌ణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, ప‌ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డ నేప‌థ్యంలో నెల‌వారీ ఈఎంఐలు చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో మార‌టోరియంకు అవ‌కాశ‌మిచ్చింది రిజ‌ర్వ్ బ్యాంకు.

మూడు నెల‌ల పాటు ఈఎంఐలు వాయిదా ప‌డ్డాయ‌ని సంతోషించారు జ‌నాలు. కానీ ఈ మూడు నెల‌ల ఈఎంఐని అస‌లులోకి క‌లిపేసి దాని మీద వ‌డ్డీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. చివ‌ర్లో అద‌నంగా మూడు నెల‌లు కాకుండా ఏడెనిమిది నెల‌ల ఈఎంఐ భారం ప‌డేట్లు ఉండ‌టంతో జ‌నాలు దీనిపై ఆవేద‌న చెందుతున్నారు.

కొంద‌రు ఆ భారాన్ని మోయ‌డానికి సిద్ధం కాగా.. ఇంకొంద‌రు ఎందుకొచ్చిన భార‌మ‌ని మార‌టోరియం తీసుకోవ‌డం మానేస్తున్నారు. అద‌నంగా మ‌రో మూడు నెల‌లు మార‌టోరియాన్ని పొడిగించినా స‌రైన స్పంద‌న లేదు. ఐతే మార‌టోరియంలో ఇలాంటి మెలిక పెట్ట‌డం ప‌ట్ల సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ మీద విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు రుణ చెల్లింపుదారుల‌కు ఉప‌శ‌మ‌నం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని, ఇక అలా చెయ్యకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.

లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో కూడా రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని అన్నారు. ఈ మెలిక‌లేమీ లేకుండా మార‌టోరియం అమ‌ల‌య్యేలా, అద‌న‌పు వ‌డ్డీ ప‌డ‌కుండా చూస్తూ ఆదేశాలు ఇవ్వాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐల‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని తెలిపింది.

Satya

Recent Posts

తెలంగాణ ప్రభుత్వానికి పవన్ సవాల్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్‌పల్లి…

2 minutes ago

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు

దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో…

51 minutes ago

తెలంగాణ మీ అయ్య జాగీరా?.. పవన్ ఫైర్

ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…

1 hour ago

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

2 hours ago

“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…

3 hours ago

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

3 hours ago