కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, పని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డ నేపథ్యంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మారటోరియంకు అవకాశమిచ్చింది రిజర్వ్ బ్యాంకు.
మూడు నెలల పాటు ఈఎంఐలు వాయిదా పడ్డాయని సంతోషించారు జనాలు. కానీ ఈ మూడు నెలల ఈఎంఐని అసలులోకి కలిపేసి దాని మీద వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించడం.. చివర్లో అదనంగా మూడు నెలలు కాకుండా ఏడెనిమిది నెలల ఈఎంఐ భారం పడేట్లు ఉండటంతో జనాలు దీనిపై ఆవేదన చెందుతున్నారు.
కొందరు ఆ భారాన్ని మోయడానికి సిద్ధం కాగా.. ఇంకొందరు ఎందుకొచ్చిన భారమని మారటోరియం తీసుకోవడం మానేస్తున్నారు. అదనంగా మరో మూడు నెలలు మారటోరియాన్ని పొడిగించినా సరైన స్పందన లేదు. ఐతే మారటోరియంలో ఇలాంటి మెలిక పెట్టడం పట్ల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు రుణ చెల్లింపుదారులకు ఉపశమనం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని, ఇక అలా చెయ్యకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.
లాక్డౌన్తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో కూడా రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని అన్నారు. ఈ మెలికలేమీ లేకుండా మారటోరియం అమలయ్యేలా, అదనపు వడ్డీ పడకుండా చూస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని తెలిపింది.
This post was last modified on May 27, 2020 9:12 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…