Political News

మార‌టోరియం, మ‌ళ్లీ వ‌డ్డీనా..

క‌రోనా-లాక్ డౌన్ కార‌ణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, ప‌ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది ప‌డ్డ నేప‌థ్యంలో నెల‌వారీ ఈఎంఐలు చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో మార‌టోరియంకు అవ‌కాశ‌మిచ్చింది రిజ‌ర్వ్ బ్యాంకు.

మూడు నెల‌ల పాటు ఈఎంఐలు వాయిదా ప‌డ్డాయ‌ని సంతోషించారు జ‌నాలు. కానీ ఈ మూడు నెల‌ల ఈఎంఐని అస‌లులోకి క‌లిపేసి దాని మీద వ‌డ్డీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. చివ‌ర్లో అద‌నంగా మూడు నెల‌లు కాకుండా ఏడెనిమిది నెల‌ల ఈఎంఐ భారం ప‌డేట్లు ఉండ‌టంతో జ‌నాలు దీనిపై ఆవేద‌న చెందుతున్నారు.

కొంద‌రు ఆ భారాన్ని మోయ‌డానికి సిద్ధం కాగా.. ఇంకొంద‌రు ఎందుకొచ్చిన భార‌మ‌ని మార‌టోరియం తీసుకోవ‌డం మానేస్తున్నారు. అద‌నంగా మ‌రో మూడు నెల‌లు మార‌టోరియాన్ని పొడిగించినా స‌రైన స్పంద‌న లేదు. ఐతే మార‌టోరియంలో ఇలాంటి మెలిక పెట్ట‌డం ప‌ట్ల సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ మీద విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు రుణ చెల్లింపుదారుల‌కు ఉప‌శ‌మ‌నం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని, ఇక అలా చెయ్యకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.

లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో కూడా రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని అన్నారు. ఈ మెలిక‌లేమీ లేకుండా మార‌టోరియం అమ‌ల‌య్యేలా, అద‌న‌పు వ‌డ్డీ ప‌డ‌కుండా చూస్తూ ఆదేశాలు ఇవ్వాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐల‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని తెలిపింది.

This post was last modified on May 27, 2020 9:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago