వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తరలించే విషయమై జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. అక్టోబర్ నెలాఖరుకు పార్టీ సెంట్రల్ ఆఫీసును విశాఖపట్నానికి తరలించాలని డిసైడ్ అయిపోయారని సమాచారం. ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయం అమరావతికి దగ్గరలోని తాడికొండలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ పరంగా కార్యాలయాలను తరలించటానికి కొద్దిగా ఆలస్యమైనా ముందు పార్టీ ఆఫీసును తరలించటంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే మూడు రాజధానుల కాన్సెప్టును జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ అంశంపై అనేక వాద, వివాదాలు నడుస్తున్నాయి. వైజాగ్ కు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని జగన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. అలాగే రాజధాని పరిధిలోని రైతులు కూడా కోర్టులో కేసువేశారు.
మూడు రాజధానుల అంశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. కాబట్టి హైకోర్టులో ఉన్న కేసులు గనుక పరిష్కారమైపోతే వెంటనే వైజాగ్ కు జగన్ తరలిపోవటం ఖాయమని తేలిపోయింది. అంతర్లీనంగా అందుకు అవసరమైన ప్రయత్నాలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పడిన కేసులను కొట్టేయించుకునేందుకు ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.
జగన్ ప్రయత్నాలకు కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరిస్తే వెంటనే కర్నూలుకు హైకోర్టు తరలిపోతుంది. దాంతో పరిపాలనా రాజధానిని జగన్ వైజాగ్ కు తరలించేస్తారు. ఈలోగానే ముందు పార్టీ సెంట్రల్ ఆఫీసును వైజాగ్ కు తరలించేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికిప్పుడు వైజాగ్ లో పార్టీ ఆఫీసు కట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు భవన్నానే తీసుకుంటున్నారట. అంటే తొందరలోనే సెక్రటేరియట్ కూడా వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది.
This post was last modified on August 12, 2021 10:53 am
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…