Political News

కేటీఆర్ గారు… ఈటల విష‌యంలో ఇదేం లెక్క‌?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు చేసే రాజ‌కీయం ఎంత విభిన్నంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న పార్టీకి సంబంధించిన నిర్ణ‌యాల ప‌రంగా చూసినా ఇటు ప‌రిపాల‌న విష‌యంలోనూ గులాబీ ద‌ళ‌ప‌తి తీరే వేరు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కోబోతుంది. ఈ ఉప ఎన్నిక‌ విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవ‌రికి చాన్స్ ద‌క్క‌నుంద‌న్న విష‌యంలో కొద్దిరోజులుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు తాజాగా తెర‌దించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గెల్లు శ్రీనివాస్‌కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో మరో విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాడారని గుర్తు చేశారు.

ఈ ఉప ఎన్నిక‌కు అన‌ధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్ రావు ఇంచార్జీగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని గెలుపు బాట న‌డిపించేందుకు ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ఆయ‌న‌తో పాటుగా రాష్ట్రానికి చెందిన మంత్రులు సైతం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు కేటీఆర్ ప్ర‌చారం చేయ‌లేదు. గ‌తంలో హైద‌రాబాద్ , వ‌రంగ‌ల్ లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో పాటుగా వివిధ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు తీసుకున్న కేటీఆర్ హుజురాబాద్ విష‌యంలో ఎందుకు సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు త్వ‌ర‌లో అసెంబ్లీకి రాబోతున్నార‌ని పేర్కొంటున్న కేటీఆర్ అభ్య‌ర్థికి ప్ర‌చారం చేసే విష‌యంలో మాత్రం ఎందుకు దృష్టి సారించ‌డం లేద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

This post was last modified on August 12, 2021 10:22 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

57 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

10 hours ago