తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చేసే రాజకీయం ఎంత విభిన్నంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పార్టీకి సంబంధించిన నిర్ణయాల పరంగా చూసినా ఇటు పరిపాలన విషయంలోనూ గులాబీ దళపతి తీరే వేరు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ఇదే జరిగింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గం ఇప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కోబోతుంది. ఈ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి చాన్స్ దక్కనుందన్న విషయంలో కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు తాజాగా తెరదించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గెల్లు శ్రీనివాస్కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో మరో విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా.. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాడారని గుర్తు చేశారు.
ఈ ఉప ఎన్నికకు అనధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఇంచార్జీగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీని గెలుపు బాట నడిపించేందుకు ప్రత్యక్ష, పరోక్షంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఆయనతో పాటుగా రాష్ట్రానికి చెందిన మంత్రులు సైతం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఇప్పటివరకు కేటీఆర్ ప్రచారం చేయలేదు. గతంలో హైదరాబాద్ , వరంగల్ లో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటుగా వివిధ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ హుజురాబాద్ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు త్వరలో అసెంబ్లీకి రాబోతున్నారని పేర్కొంటున్న కేటీఆర్ అభ్యర్థికి ప్రచారం చేసే విషయంలో మాత్రం ఎందుకు దృష్టి సారించడం లేదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
This post was last modified on August 12, 2021 10:22 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…