ఇపుడిదే అంశంపై టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. మొన్న జూలై నెలలలోనే కారు పార్టీలో కౌశిక్ చేరారు. అయితే ఆగస్టు 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ ను ఎంఎల్సీ గా నామినేట్ చేయాలని తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ కార్యాలయానికి ఫైల్ పంపినట్లు అధికార వర్గాలు చెప్పాయి.
అయితే ఇప్పటివరకు గెజెట్ ప్రకటన రాకపోవటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి కౌశిక్ ను ఎంఎల్సీ గా చేయటం పార్టీలోని చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ లో చేరిన వెంటనే పదవి ఇచ్చేయటాన్ని చాలామంది టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే విషయాన్ని కేసీఆర్ తో చెప్పే ధైర్యం లేదు కాబట్టి నేతల మధ్యనే చర్చల్లో నలుగుతోంది. సరే నేతలు ఎంతమంది అనుకున్నా ఉపయోగం లేదు కాబట్టి చేసేది లేక మౌనంగా ఉండిపోయారు.
గవర్నర్ కోటాలో ఎవరిని ఎంఎల్సీగా ముఖ్యమంత్రి కార్యాలయం పంపినా వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేసేస్తారు. ఇందులో గవర్నర్ కు ప్రత్యేకమైన ఇంట్రస్టంటు ఏమీ ఉండదు కాబట్టి సీఎం నిర్ణయమే ఫైనల్. అలాగే కౌశిక్ ఫైలుపై గవర్నర్ సంతకం పెట్టేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఫైల్ పంపి పది రోజులైనా అతీగతీ కనబడలేదట. దాంతో ఫైలు వెనకాల ఏమి జరుగుతోందో నేతలకు అర్ధంకాక బుర్రలు గోక్కుంటున్నారు.
ఇదే విషయాన్ని కనుక్కోవాలని సీఎంవో అధికారులను అడిగినా, జీఏడీ ఉన్నతాధికారులను అడిగినా తమకేమీ తెలీదంటున్నారట. పోనీ గవర్నర్ కార్యాలయంలో వాకాబు చేద్దామంటే అక్కడి అధికారులు కూడా నోరిప్పటంలేదట. అంటే మంత్రివర్గం నిర్ణయం తర్వాత ఫైలు సీఎంవోలేనే ఆగిపోయిందా ? లేకపోతే గవర్నర్ కార్యాలయంలో పెండింగ్ ఉందా అనేదే ఎవరికీ అర్ధం కావటంలేదు. ఒకవేళ గవర్నర్ సంతకం అయిపోతే అదేరోజు గెజెట్ కూడా వచ్చేస్తుంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే కౌశిక్ తెలంగాణా రాష్ట్రానికి పూర్తి వ్యతిరేకమట. తెలంగాణా కోసం ఉద్యమం జరిగిన రోజుల్లో ఈయన ఆధ్వర్యంలో వ్యతిరేక ఉద్యమం జరిగిందట నియోజకవర్గంలో. ఆ సందర్భంగానే కౌశిక్ పై అనేక కేసులు కూడా నమోదయ్యాయట. సరే ఈ విషయాన్ని వదిలేస్తే ఈయనపై సుమారు 12 కేసులు పెండింగ్ లో ఉన్నాయట. చిన్నా, పెద్దా కేసులు కలిపి సంవత్సరాల తరబడి విచారణలోనే ఉన్నాయట చాలా కేసులు. మరి ఈ విషయం గవర్నర్ దృష్టికి వెళితే ఫైలును పెండింగ్ లో పెట్టారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏదేమైనా కౌశిక్ ఎంఎల్సీ విషయం మాత్రం సస్పెన్సు పెరిగిపోతోంది.
This post was last modified on August 11, 2021 12:02 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…