తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరిప్పారు. ఉపఎన్నికలో నిరుద్యోగులు ఎవరన్నా పోటీచేస్తే వారికి తమ పార్టీ మద్దతుగా నిలబడుతుందని షర్మిల ప్రకటించారు. నియోజకవర్గంలోని సిరిసేడు గ్రామంలో మంగళవారం జరిగిన నిరుద్యోగ సమస్యల నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
హుజూరాబాద్ ఉపఎన్నికల వల్ల సమాజానికి ఎలాంటి లాభం ఉండదు కాబట్టే తమ పార్టీ పోటీ చేయదని షర్మిల స్పష్టంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పోటీపై అంత స్పష్టంగా ప్రకటించిన షర్మిల తాజా మద్దతు విషయంపై ప్రకటన చేశారు. నిరుద్యోగులు పోటీచేస్తే మద్దతు ఇస్తానని చేసిన ప్రకటనను కొందరు స్వాగతిస్తున్నారు. అయితే నిరుద్యోగులు పోటీచేసేంత సీన్ ఇక్కడ కనబడటంలేదు. ఎందుకంటే గెలుపుకోసం ఒకవైపు అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటోంది.
ఇదే సమయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా రంగంలోకి దూకటానికి రెడీగా ఉన్నాయి. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు కారకుడైన ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. ఇన్ని పార్టీల మధ్య ఓ నిరుద్యోగి పోటీ చేస్తారని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే కేసీయార్ మీద కోపంతో నిరుద్యోగులందరు కలిసి ఎవరినైనా పోటీలోకి దింపుతారేమో చెప్పలేం.
షర్మిల చేసిన ప్రకటన కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే వైఎస్సార్టీపీకి ఉన్న జనాల మద్దుతుపైన కూడా ఓ అంచనాకు రావచ్చు. నిరుద్యోగ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పడుతుందో ? అందులో షర్మిల పార్టీ ఓట్లెన్ని అన్న విషయాలను విడదీయలేకపోయినా ఓ అంచనాకు అయితే రావచ్చు. ఎన్ని ఓట్లుపడతాయనే విషయాన్ని పక్కనపెట్టేస్తే షర్మిల పార్టీ తరపున పనిచేయబోయే నేతలు ఎంతమంది అనే విషయంపై జనాలకు ఓ క్లారిటి వచ్చేస్తుంది.
This post was last modified on August 11, 2021 11:27 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…